మోగాలో రోడ్ విలేజ్లోని ఓ గురుద్వారాలో పోలసులకు అమృత్ పాల్ లొంగిపోయినట్టు తెలుస్తోంది. అమృత్ పాల్ సింగ్ను అసోంలోని డిబ్రుఘడ్కు తరలిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ మద్దతుదారుల్లో 8 మంది జాతీయ భద్రతా చట్టం కింద ఇప్పటికే అక్కడి జైలులో ఉన్నారు.
మార్చి 18న జలంధర్ సమీపంలో పోలీసులకు చిక్కినట్టే చిక్కి తన సహచరుడి పపల్ప్రీత్ సింగ్తో కలిసి బైక్పై అమృత్పాల్ పరారైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పంజాబ్ పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. అమృత్పాల్ అరెస్ట్తో పంజాబ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. మోగాతో పాటు అతడి స్వగ్రామం జల్లుపుర్ ఖేరాలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇప్పటికే అమృతపాల్ వ్యవహారానికి సంబంధించి వందమంది వరకు అరెస్టు అయ్యారు. అమృత్సర్ విమానాశ్రయం నుంచి లండన్కు తప్పించుకునే క్రమంలో పోలీసులకు దొరికిపోయింది అమృత్ పాల్ సింగ్ భార్య కిరణ్దీప్ కౌర్. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన జరిగిన మూడు రోజులకే వారిస్ పంజాబ్ దే చీఫ్ పోలీసులు ఎదుట లొంగిపోయాడు.
ఖలిస్థానీ దేశం కోసం విపరీతంగా ప్రచారాలు చేస్తున్న వారిలో ఈ అమృత్ పాల్ ఒకడు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న అమృత్ పాల్ మద్దతుదారుడు, ఓ కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లవ్ప్రీత్ సింగ్ తూఫాన్ను పోలీసులు అరెస్ట్ చేయగా అమృత్ పాల్ మద్దతుదారులు భారీ కత్తులు, తుపాకులతో అంజాలా పోలీస్ స్టేషన్పై దాడి చేశారు.
ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అప్పటి నుంచి అమృత్ పాల్పై పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే.ఖలిస్థానీ దేశం కోసం అమృత్ పాల్ చేస్తున్న ప్రచారాలు బయటపడ్డాయి.
ఫలితంగా అతడిని అరెస్ట్ చేసేందుకు పంజాబ్ పోలీసులు రంగంలోకి దిగాడు. కానీ చాకచక్యంగా తప్పించుకుని మాయమైపోయేవాడు. ఉత్తరాఖండ్, హరియాణా పోలీసులు సైతం అప్రమత్తమై అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఓవైపు అతడి కోసం అన్వేషిస్తూనే, మరోవైపు అతడి మద్దతుదారులు, సన్నిహితులు, కుటుంబసభ్యులను విచారించడం మొదలిపెట్టారు.
More Stories
రాహుల్ గాంధీ `పాకిస్తాన్ అనుచరుడు’
బ్రిజ్ భూషణ్ సింగ్ కు బిజెపి సీట్ నిరాకరణ!
రజాకార్ల గుప్పిట్లో నుండి హైదరాబాద్ విముక్తికై బిజెపికి ఓటు