భారత పర్యటనలో ఉన్న యాపిల్ సీఈవో టిమ్కుక్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. భారత్లో వివిధ రంగాల్లో సాంకేతికత ప్రభావంతోపాటు దేశంలో పెట్టుబడులకు సంబంధించిన విషయాలను ప్రధానితో చర్చించినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పెట్టుబడులకు కంపెనీ కట్టుబడి ఉందని తెలిపారు.
‘ఘన స్వాగతం పలికినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు. విద్యారంగం మొదలు అభివృద్ధి, తయారీ రంగంతోపాటు పర్యావరణం వరకు భారత భవిష్యత్తుపై సాంకేతికత సానుకూల ప్రభావం చూపుతుందనే విషయాన్ని మీతో పంచుకుంటున్నాం. మేం దేశవ్యాప్తంగా విస్తరించడంతోపాటు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని యాపిల్ సీఈవో టిమ్కుక్ చెప్పారు.
టిమ్ కుక్ ట్వీట్పై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ‘‘ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. వేర్వేరు అంశాలపై ఆలోచనలను పరస్పరం పంచుకోవడం హర్షణీయం. భారత్లో టెక్ సంబంధిత మార్పులపై మాట్లాకోవడం హైలైట్’’ అని పేర్కొంటూ మోదీ ట్వీట్ చేశారు. అంతకుముందు ప్రధాని మోదీతో భేటీకి ముందు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్తో యాపిల్ సీఈవో టిమ్ కుక్ భేటీ అయ్యారు.
భారత్లో తొలి సొంత రిటైల్ స్టోర్ను యాపిల్ సంస్థ ఈ నెల 18న ప్రారంభించింది. ముంబయిలోని బంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్లో సంస్థ సీఈవో టిమ్కుక్ నేరుగా వినియోగదారులకు ఆహ్వానం పలికారు. దేశంలో రెండో విక్రయ కేంద్రాన్ని ఏప్రిల్ 20న డిల్లీలో టిమ్కుక్ ప్రారంభిస్తారు. అక్కడ కూడా ఆయనే నేరుగా కస్టమర్లకు స్వాగతం పలుకుతారు.
More Stories
ఒక్క సీటు కోసం ఉగ్రవాద సంస్థకు కాంగ్రెస్ మద్దతు
ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా
ఇండియా కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు