”దేశ ప్రజలందరూ ఇవాళ ప్రశాంతంగా ఇళ్లలో నిద్రిస్తున్నారంటే అందుకు మన సరిహద్దుల్లో రేయింబవళ్లు పహారా కాస్తున్న మన ఐటీబీపీ జవాన్లు, ఆర్మీనే కారణం. దుష్టపన్నాగంతో మన భూభాగంపై కన్నేసే సాహసం ఎవరూ చేయలేరు. ఈ విషయాన్ని మనం ఇవాళ చాలా గర్వంగా చెప్పుకోవచ్చు” అని తెలిపారు.
“జవాన్ల త్యాగాలకు నేను సెల్యూట్ చేస్తున్నారు. 1962లో ఇక్కడ భూమిని ఆక్రమించుకునేందుకు వచ్చిన వారెవరైతే ఉన్నారో వారు ఇవాళ మీ దేశభక్తి కారణంగా వెనక్కి వెళ్లిపోయారు” అని చైనాను పరోక్షంగా ఉద్దేశించి అమిత్షా హెచ్చరించారు.
మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ”లుక్ ఈస్ట్ పాలసీ”తో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తున్నాయని, ఇప్పుడు ఆ ప్రాంతాలు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నాయని హోం మంత్రి చెప్పారు. 2014కు ముందు ఈశాన్య ప్రాంతమంతా కల్లోపిత ప్రాంతంగా ఉండేదని, గత 9 ఏళ్లలో మోదీ తీసుకువచ్చిన లూక్ ఈస్ట్ పాలసీతో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతోందని చెప్పారు.
వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాంలో కిబితూ మొదటి గ్రామమని ఆయన అభివర్ణించారు. ఇది చిట్టచివరి గ్రామం ఎంతమాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు. గతంలో తాను ఇక్కడికి వచ్చినప్పుడు దేశంలోని చివరి గ్రామాన్ని దర్శిస్తున్నారని తనతో అనేవారని, అయితే ఇవాళ తాను ఒక విషయం చెప్పదలచుకున్నానని, కిబితూ ఎంతమాత్రం చివరి గ్రామం కాదని, మొదటి గ్రామమని పేర్కొన్నారు.
2022-23 నుండి 2025-26 ఆర్థిక సంవత్సరాలకు రూ.4,800 ఆర్థిక కేటాయింపులతో కేంద్ర ప్రాయోజిత పథకమైన “వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్” కు మోదీ సారథ్యంలోని కేంద్రం ఆమోదం తెలిపిందని చెప్పారు. గుర్తించబడిన సరిహద్దు గ్రామాలలో నివసించే ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడం, ఉత్తర సరిహద్దులోని బ్లాకుల గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం ఈ పథకం లక్ష్యమని చెప్పారు. తొలి విడతగా 662 గ్రామాలను గుర్తించామని, అందులో 455 గ్రామాలు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయని తెలిపారు.
ఇటు అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల పేర్లను చైనా మార్చడాన్ని భారతదేశం గత వారం తిరస్కరించింది. ఆ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగమని, అలాంటి రాష్ట్రంలోని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. దక్షిణ టిబెట్గా చెప్పుకునే అరుణాచల్ ప్రదేశ్లోని మరో 11 ప్రదేశాలకు చైనా పేర్లను బీజింగ్ ప్రకటించింది.
More Stories
కుమారస్వామి పేరు చెప్తే రూ 100 కోట్లు ఇస్తానన్న శివకుమార్
స్వాతి మలివాల్పై దాడి కేసులో బిభవ్ కుమార్ అరెస్ట్
కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులే లక్ష్యంగా మూక హింస