పేపర్ లీకేజిలోబండి సంజయ్ కుట్రదారునిగా, ఏ1గా ఎఫ్ఐఆర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై రెండు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. టెన్త్ పరీక్ష పేపర్లు తెలుగు, హిందీ లీకులకు కుట్ర చేశారనే అభియోగాలు నమోదు చేశారు పోలీసులు. ఒక కేసు కరీంనగర్ 2 టౌన్ లో, మరో కేసును వరంగల్ కమలాపూర్ లో నమోదు చేశారు. సంజయ్ అరెస్ట్ ను ఈ మేరకు వరంగల్ పోలీస్ కమీషనర్ రంగనాథ్ ధృవీకరించారు.

 ఏప్రిల్ 4వ తేదీ రాత్రి అరెస్ట్ చేశామని, అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాలకు ఎఫ్​ ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. పేపర్ లీకేజీలో, ప్రచారం వెనక ఎంపీ బండి సంజయ్ పాత్ర ఉందని కుట్రదారుడిగా పేర్కొంటూ. అతనిపై 420, 120(బి), సెక్షన్ 5 ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.  సీఆర్‌పీసీ 154, 157  సెక్షన్ల ప్రకారం అభియోగాలు నమోదు చేశారు.

 బండి సంజయ్ అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రిమాండ్ రిపోర్టులో  ఎ1 గా బండి సంజయ్ ని చేర్చారు.  ఎ2 గా ప్రశాంత్, ఎ3 మహేష్, ఎ4 శివగణేష్ గా పోలీసులు రిమాండ్ రిపోర్టులో చూపించారు. 

బండి సంజయ్ ఎఫ్ఐఆర్ లోని కీలక అంశాలను చూస్తే సంజయ్ చర్యల వల్ల మొత్తం పరీక్ష నిర్వహణలు ఇబ్బందులుగా మారుతున్నాయని, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ దీనిపై ఆధారపడి ఉందని, విద్యార్థుల పరీక్షలకు విఘాతం కలగకుండా ఉండేందుకే ముందస్తుఅరెస్ట్ చేశాం అని పోలీసులు తమ ఎఫ్ ఐఆర్ కాపీలో స్పష్టం చేశారు.

అదే విధంగా వికారాబాద్, కమలాపూర్ లో పేపర్ లీకేజీలపై సంజయ్ పత్రికా ప్రకటనలు ఇచ్చారని, అంతేకాకుండా పేపర్ లీకేజీలకు ప్రభుత్వమే బాధ్యత అంటూ ప్రకటించారంటూ ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్నారు.  విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని, పరీక్ష కేంద్రాల దగ్గర ధర్నాలు చేయాలని బీజేపీ నేతలకు పిలుపునిచ్చారని ఎఫ్ఐఆర్ లో రాశారు.

పదో తరగతి పరీక్షల నిర్వహణకు విఘాతం కలిగేలా ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారని, దీని వల్ల పరీక్షల నిర్వహణ ఇబ్బందిగా మారుతుందంటూ బండి సంజయ్ ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు.  ఈ క్రమంలోనే రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసులు నమోదయ్యాయి.

హైకోర్టులో బిజెపి పిటీషన్

బండి సంజయ్ అరెస్టు, పోలీసులు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టులో బీజేపీ లీగల్ సెల్ పిటీషన్ వేసింది. ఎంపీగా సంజయ్ ను అర్థరాత్రి బలవంతంగా, అక్రమంగా ఇంట్లో నుంచి తీసుకెళ్లటాన్ని సవాల్ చేస్తూ ఈ పిటీషన్ వేసింది. బుధవారం ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు తదుపరి ప్రక్రియను మాత్రం గురువారానికి వాయిదా వేసింది హైకోర్టు.

ఈ పిటీషన్ లో మొత్తం ఆరుగురిని ప్రతివాదులుగా చేర్చారు. హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, బొ మ్మల రామారం సీఐలను ప్రతివాదులుగా ఉన్నారు. హెబియస్ కార్పస్ పిటీషన్ విచారణకు వచ్చే ముందే పోలీసులు సంజయ్ ను అరెస్ట్ చూపించారు పోలీసులు.

అత్యవసరంగా దాఖలు చేసిన పిటీషన్ ను హౌస్ మోషన్ లో విచారించేందుకు నిరాకరించిన న్యాయస్థానం. గురువారం రెగ్యులర్ బెంచ్ లోనే వాదనలు వింటామని స్పష్టం చేసింది. డివిజన్ బెంచ్ లోనే ఈ పిటీషన్ పై విచారణ జరగనుంది. కరీంనగర్ లోని బండి సంజయ్ ఇంటికి వెళ్లినప్పటి నుంచి.. ఆ తర్వాత జరిగిన అన్ని పరిణామాలను ఈ పిటీషన్ లో స్పష్టం చేసింది బీజేపీ లీగల్ టీం.