ఇటీవల భారత్, అమెరికా సహా పలు దేశాల్లో చైనా నిఘా బెలూన్లు కలకలం రేపిన ఉదంతాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు. భవిష్యత్లో యుద్ధాలు సైనికబలంతో కాకుండా, అంతరిక్ష శక్తితో జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో చైనా వ్యూహాలు ప్రపంచానికి ముప్పేనని పేర్కొంటున్నారు.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో ఇదే జరిగిందని గుర్తుచేస్తున్నారు. మొదట ఉక్రెయిన్ ఎయిర్బేస్లపై దాడులు చేసిన రష్యా వాటిని పూర్తిగా ధ్వంసం చేసిందని వివరిస్తున్నారు. లో ఆర్బిట్ ఉపగ్ర హాలు అణు యుద్ధాల్లో కీలక భూమిక పోషిస్తాయని, ఇప్పుడు చైనా ఆ కోణంలోనే ఎక్కువ మొత్తంలో ఉపగ్రహాలను ప్రయోగిస్తుందని ఆరోపిస్తున్నారు.
అంతరిక్షరంగంలో అమెరికాను అధిగమించేలా చైనా ప్రణాళికలు చేస్తోందని స్వయంగా పెంటగాన్ నివేదిక 2022 స్పష్టం చేసింది. లేకుంటే.. , అమెరికా గగనతలానికి ‘చైనా గ్రహణం’ పడుతుందని హచ్చరికలు చేసింది. 2045 కల్లా చైనా అంతరిక్ష రంగాన్ని శాసిస్తుందని ఆ నివేదిక అంచనా వేసింది. తమదేశం నిర్వహించే 37జిపిఎస్ ఉపగ్రహాలతో పాటు అనేక వాణిజ్య, వాతావరణ ఉపగ్రహాలు, రక్షణ శాఖ పర్యవేక్షణా కార్యక్రమాల ద్వారా నిర్వహంచబడు తున్న అనేక ఉపగ్రహాలపై చైనా-రష్యా సైబర్ దాడులు చేసే ప్రమాదం ఉందని అమెరికా స్పేస్ ఫోర్స్ అధికారులు తెలిపారు.
ఉక్రెయిన్తోపాటు ఇతర చోట్ల అణు క్షిపణి నియంత్రణతో సహా వాయు, భూ సైనిక కార్యకలాపాలను జిపిఎస్ శాటిలైట్ల ద్వారా అమెరికా నిరంతరం సమన్వయం చేస్తుంటుందని చెప్పారు. నివేదికల ప్రకారం, చైనాకు రోబోటిక్ చేయి అమర్చిన ఉపగ్రహం ఉంది. ఇది మరొక ఉపగ్రహాన్ని పంజాతో పట్టుకునే సామర్థ్యాన్ని కలిగివుంటుంది. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా అంతరిక్ష సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఇందుకోసం బడ్జెట్లో 25 శాతం మేరకు అధ్యక్షుడు జో బైడెన్ కేటాయింపులు పెెంచడం జరిగింది.
More Stories
సీఎం రమేష్ అరెస్ట్.. కాన్వాయ్ పై వైసీపీ నేతల దాడి
మాదిగలు, బిసిలు కాంగ్రెస్కు ఓటేయవద్దు
ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత