కేజ్రీవాల్ చెప్తే బీఆర్ఎస్కు రూ. 75 కోట్లు ఇచ్చా

మనీలాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ విడుదల చేశాడు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బిగ్ బాంబ్ పేల్చాడు. బీఆర్ఎస్, ఆప్ పార్టీలపై కీలక ఆరోపణలు చేశాడు. ఈ కేసులో రూ. 100 కోట్ల ముడుపులు చేతులు మారాయంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సుఖేశ్ చంద్రశేఖర్ రూ. 75 కోట్లకు సంబంధించిన గుట్టు విప్పాడు. 

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెబితే బీఆర్ఎస్ కు రూ. 75 కోట్లు ఇచ్చానన్నారు. రూ. 15 కోట్లు చొప్పున ఐదు సార్లు బీఆర్ఎస్ నేతలకు రూ. 75 కోట్లు ఇచ్చినట్లను ఓ లేఖలో వెల్లడించాడు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఆఫీసు దగ్గర పార్క్ చేసిన రేంజ్ రోవర్ కారులో ఉన్న వ్యక్తికి డబ్బులు ఇచ్చానని తన లేఖలో పేర్కొన్నాడు.

ఆ ఏపీ అనే వ్యక్తి కూర్చున్న రేంజ్ రోవర్ కారు నెంబర్ 6060 అని కూడా లేఖలో పేర్కొన్నాడు సుఖేష్. అయితే, ఏపీ అంటే ఎవరు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఏపీ అంటే అరుణ్ రామచంద్ర పిళ్లైయా.. లేక మరో వ్యక్తా అన్నది మాత్రం ఉత్కంఠగా మారింది. 

పైగా, ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తికే ఈ మొత్తాన్ని అందజేశానని చెప్పడం గమనార్హం.  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సుఖేష్ చంద్రశేఖర్ రాసిన లేక కలకలం రేపుతోంది. కేజ్రీవాల్ చెప్తే 2020లో హైదరాబాద్ బీఆర్ఎస్ ఆఫీస్ వద్దకు తాను వచ్చినట్లు సుఖేష్ చంద్రశేఖర్ వెల్లడించాడు. కేజ్రీవాల్, బీఆర్‌ఎస్‌పై ఆరోపణలతో కూడిన లేఖను తన లాయర్ అనంత్ మాలిక్ ద్వారా సుఖేశ్ బయట పెట్టాడు.

ఆ సమయంలో రేంజ్ రోవర్ కారులో ఏపీ అనే వ్యక్తికి రూ.15 కోట్లు ఇచ్చినట్లు సుఖేష్ లేఖలో పేర్కొన్నాడు. కేజ్రీవాల్, సత్యేంద్రజైన్ చెప్పినట్లు ఏపీ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చినట్లు తెలిపాడు. మరోవైపు.. ఈ విషయంలో కేజ్రీవాల్‌తో జరిపిన 700 పేజీల వాట్సప్ చాట్ తన దగ్గర ఉందని చెబుతున్నాడు. సమయం వచ్చినప్పుడు చాట్‌ను విడుదల చేస్తానని పేర్కొన్నాడు.

చాటింగ్ లో కోడ్ పదాలు వాడారని చెబుతూ  15 కేజీల నెయ్యి పేరిట రూ.15 కోట్లు తరలించాలని కేజ్రీవాల్ చెప్పినట్లు సుఖేష్ చంద్రశేఖర్ వెల్లడించాడు. కేజ్రీవాల్‌తో జరిపిన వాట్సాప్, టెలీగ్రాఫ్ చాట్‌లు 700 పేజీలు తన వద్ద ఉన్నాయని పేర్కొంటూ కేజ్రీవాల్ అవినీతి, అక్రమాలు అన్నీ బయటపెడతానని సుఖేష్ స్పష్టం చేశారు.

సిబిఐ, ఈడీ కేసులనుంచి విముక్తి కలిగిస్తానంటూ పలువురి వ్యాపారవేత్తల్ని మోసం చేసిన కేసులో సుఖేశ్ చంద్రశేఖర్ తీహార్ జైల్లో ఉన్నాడు. రూ.200 కోట్ల హవాలా కేసులో సుఖేశ్‌ చంద్రశేఖర్‌ నిందితుడు. కేజ్రీవాల్‌ను త్వరలోనే తీహర్ క్లబ్‌కు ఆహ్వానిస్తానని ఆ మధ్య కోర్టులో కామెంట్ చేయగా.. ఇప్పుడు ఇలాంటి కీలక ఆరోపణలు చేయటం సర్వత్రా చర్చనీయాశంగా మారింది.