
ఇక దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య పది వేల మార్క్ను దాటింది. ప్రస్తుతం 10,300 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దేశంలో 2020 ఏప్రిల్ తర్వాత 2022 నవంబర్లో యాక్టివ్ కేసుల సంఖ్య పదివేల దిగువకు పడిపోయింది. అప్పటి నుంచి పదివేల మార్క్ను దాటడం ఇదే ప్రథమం.
ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 932 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,41,64,815కి చేరింది. మహమ్మారి కారణంగా ఆరుగురు మృతి చెందారు. ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందగా.. కేరళలో ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,837గా నమోదైంది.
రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.02 శాతం మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని తెలిపారు. రికవరీ రేటు 98.79 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఐదు నెలల తర్వాత వేల సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో నేడు రాష్ట్రాలు, కేంద్ర పాలిక ప్రాంతాల ప్రభుత్వాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది.
More Stories
ఆవులు, ప్లకార్డులతో కర్ణాటక బీజేపీ నిరసనలు
భారతీయ నౌకాదళం మరో అరుదైన ఘనత
మణిపూర్ లో తాజా హింసలో బీఎస్ఎఫ్ జవాను మృతి