త్వరలో 6 జీ సేవలను అందించడానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. నేడు ఆవిష్కరించిన 6జీ విజన్ డాక్యుమెంట్ ఆధారంగా దేశంలో 6 జీ సేవల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఈ 6 జీ విజన్ డాక్యుమెంట్ ను భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, ఆర్ అండ్ డీ సంస్థలు, విద్యా సంస్థలు, టెలీకాం సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉన్న టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్ రూపొందించింది.
కాగా, భారత్లో అతితక్కువ ధరకే డేటా లభ్యమవుతోందని.. గ్రామాల్లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగిందని ప్రధాని చెప్పారు. పట్టణాల కంటే గ్రామీణ ప్రజలే ఎక్కవగా ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారని తెలిపారు. దేశంలో 2 లక్షల గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ సేవలు అందాయని చెప్పారు. దేశంలో బ్రాడ్బ్యాండ్ వినియోగదారులు కూడా బాగా పెరిగారని ఈ సందర్భంగా తెలిపారు.
న్యూఢిల్లీలోని మెహ్రౌలిలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ-డాట్) భవనంలోని రెండో అంతస్తులో ఉన్న ఏరియా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి 2022 మార్చిలో ఐటీయూతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. కొత్త కార్యాలయం భారతదేశం, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ లకు సేవలందిస్తుందని, దేశాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం- ఈ ప్రాంతంలో పరస్పర ప్రయోజనకరమైన ఆర్థిక సహకారాన్ని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుందని ఒక ప్రకటనలో తెలిపింది.
More Stories
రెజ్లర్ బజరంగ్ పూనియాపై సస్పెన్షన్ వేటు
ఓట్ల కోసం నిప్పుతో కాంగ్రెస్ చెలగాటం
పోలింగ్కు ముందే జారిపోతున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు