సాగరమాల కార్యక్రమం కింద, మంత్రిత్వ శాఖ మరో 4 ప్రాజెక్టులకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. దీంతో, కర్ణాటకలో తేలియాడే జెట్టీ ప్రాజెక్టుల సంఖ్య 11కు చేరుకుంది. ఈ ప్రాజెక్టులు ప్రధానంగా గురుపుర నది, నేత్రావతి నదిపై ఏర్పాటు చేశారు, పర్యాటక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. తన్నీర్ బావి చర్చి, బంగ్రా కులూరు, కులూరు వంతెన, జప్పిన మొగరు ఎన్ హెచ్ వంతెన ప్రాంతాల్లో ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి.
తమిళనాడులోనూ 4 తేలియాడే జెట్టీ ప్రాజెక్టులకు మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. భారతదేశ ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశం రామేశ్వరంలోని అగ్ని తీర్థం, విల్లూంది తీర్థం వద్ద ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటికి అదనంగా, కడలూర్, కన్యాకుమారి వంటి ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల్లోని ప్రాజెక్టులు పర్యాటకులకు ఉపయోగపడతాయి.
పర్యాటకులకు సురక్షితమైన, ఇబ్బందులు లేని రవాణాను అందించడంలో ఈ ప్రాజెక్టులు సాయపడతాయి. తీర ప్రాంత ప్రజల అభివృద్ధికి దోహదపడతాయి. కేంద్ర ఓడరేవులు, నౌకారవాణా, జలమార్గాల శాఖ మంత్రి శర్వానంద సోనోవాల్ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.
‘అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు అవసరమైన బలమైన అనుసంధాన్ని అందించడం కోసం మన గౌరవనీయ ప్రధానమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కర్ణాటక, తమిళనాడులోని తీర ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి పెద్ద ప్రోత్సాహంగా ఈ జెట్టీల ఏర్పాటు నిలుస్తుంది, స్థానిక జనాభాకు మరిన్ని ఉపాధి అవకాశాలను తీసుకొస్తుంది. జల సంబంధిత పర్యాటకం, ప్రాంతీయ వాణిజ్యానికి కొత్త మార్గాలను సృష్టిస్తుంది’ అని తెలిపారు.
More Stories
దక్షణాదిన భారీ వర్షాలు.. ఉత్తరాదిన వడగాల్పులు
4 దశలలో మొత్తం 66.95 శాతం పోలింగ్
కోవాగ్జిన్ తీసుకున్న 30 శాతం మందిలో ఆరోగ్య సమస్యలు