కల్వకుంట్ల కుటుంబానికి ఆపదొస్తే తెలంగాణకు ముడి పెట్టడమా!

కల్వకుంట్ల కుటుంబానికి ఆపదొస్తే తెలంగాణ సమాజానికి ముడి పెట్టడం ఏమిటని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్ డిప్రశ్నించారు. తెలంగాణలో ప్రభుత్వ ఆస్తులు తరిగాయని, కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు మాత్రం పెరిగాయని ఆయన ధ్వజమెత్తారు.
 
బుధవారం పాలమూరు జిల్లా కేంద్రంలో మీడియాతో  తొమ్మిదేళ్లుగా తెలంగాణను దొచుకున్నది చాలదన్నట్లు ఢిల్లీలో దోస్తీ కట్టి లిక్కర్ కుంభకోణానికి తెర తీసిందని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత తప్పు చేయకుంటే ఎందుకు తమ సెల్ ఫోన్లను పగలగొట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమపై వచ్చిన ఆరోపణలను నిరూపించుకోవాల్సింది పోయి తెలంగాణ సభ్య సమాజానికి అంటగట్టే పరయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ అసెంబ్లీలో ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా పాలన కొనసాగించి, నేడు మహిళా బిల్లు గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు అలినట్లు ఉందని ఎద్దేవా చేశారు.
 
నరేంద్ర మోదీ 2014 అధికారంలోకి వచ్చిన నాడు దేశంలో మహిళల కంటే పురుష జనాభా ఎక్కువ ఉండేదని, అది గుర్తించిన ప్రధాని బేటి బచావో .. బేటి పడావో అనే పథకం తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు. దాని ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం ఆడబిడ్డలు విద్యను అభ్యసించే దిశగా పాలన కొనసాగుతుందని చెప్పారు.
 
సీఎం కేసీఆర్ 10 శాతం గిరిజన రిజర్వేషన్ చేస్తానని మాయమాటలు చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు. మొట్టమొదటిగా దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి దళిత సామాజిక వర్గాన్ని వెన్నుపోటు పొడిచారని కిషన్ రెడ్డి మండిపడ్డాయిరు. దళిత విద్యార్థులకు నేడు స్కాలర్షిప్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
 
కేంద్రానికి దళిత విద్యార్థుల జాబితాను సరైన సమయంలో పంపకపోవడం వల్ల రూ. 300 కోట్ల పేద దళిత విద్యార్థులకు అందకుండా పోతున్నాయని ఆయన చెప్పారు. దళిత బంధు టిఆర్‌ఎస్ బంద్‌గా మారిందని ధ్వజమెత్తారు. రైతులకు ఉచిత ఎరువులు ఇస్తానని చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు.
 
ధరణి పేరుతో భూమి దోపిడి జరుగుతుందని చెబుతూ శాసనసభ సమావేశాలలో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై సంక్షేమ పథకాలపై చర్చించడం లేదన్నారు. ప్రధానిని తిట్టడానికే సమావేశాలు జరుపుతున్నారని దుయ్యబట్టారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు.
 
 పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా భూముల సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించి గుణాత్మకమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యం పాలన బీజేపీ అందిస్తదని ఆయన హామీ ఇచఃరు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్‌లకు స్వేచ్చ లేకుండా పోయిందని చెప్పారు.
 
రాజ్యాంగ వ్యవస్థలో గవర్నర్ వ్యవస్థ ఒకటని, అలాంటి గవర్నర్ ఒక మహిళ అని చూడకుండా అవమానం చేస్తూ మంత్రులు మాట్లాడటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఐదు లక్షల రూపాయలతో వైద్య పొందే అవకాశం కల్పిస్తుందని చెప్పారు.  తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో అర్హులైన పేదలు ఆ పథకం ద్వారా రేషన్ పొందలేకపోత్నునారని కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు తెలంగాణలో నెలకొన్నాయని పేర్కొన్నారు.