రష్యా నుంచి భారత్ ఫిబ్రవరి నెలలో 1.6 మిలియన్ బ్యారెళ్లు ముడి చమురు దిగుమతి చేసుకుంది. ఇది ఇరాక్, సౌదీ అరేబియాల నుంచి దిగుమతి చేసుకుంటున్న దానికన్నా ఎక్కువ. 2022 ఫిబ్రవరిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి రష్యా నుంచి భారత్కు చమురు దిగుమతులు కేవలం ఒక్క శాతం మాత్రమే ఉండేవి. ప్రస్తుతం 35 శాతానికి చేరుకున్నాయి.
భారత్కు చమురు దిగుమతి చేస్తున్న దేశాల్లో రష్యా వరుసగా ఐదో నెలలో కూడా అగ్రస్థానంలో ఉంది. ఈ వివరాలన్నింటినీ ఎనర్జీ కార్గో ట్రాకర్ వొర్టెక్సా అందించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా, అమెరికాల తర్వాత భారత్ మూడో అతి పెద్ద దేశం. ఇరాక్ నుంచి భారత్కు ఫిబ్రవరి నెలలో 9,39,921 బ్యారెళ్ల చమురు దిగుమతి కాగా సౌదీ అరేబియా నుంచి 6,47,813 బ్యారెళ్ల చమురు దిగుమతి అయింది.
యూఏఈ నుంచి భారత్కు ఫిబ్రవరి నెలలో 4,04,570 బ్యారెళ్ల చమురు దిగుమతి కాగా అమెరికా నుంచి 2,48,430 బ్యారెళ్ల చమురు దిగుమతి అయింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా, యూరప్ దేశాలు ఆర్ధిక ఆంక్షలు విధించడంతో దిక్కుతోచని రష్యా ప్రత్యామ్నాయ మార్గాలు వెతికింది. పుతిన్ సారధ్యంలోని పుతిన్ ప్రభుత్వం భారీ డిస్కౌంట్లు కూడా ప్రకటించింది. దీంతో మోదీ నేతృత్వంలోని భారత్ వెనువెంటనే ఆ దేశం నుంచి దిగుమతులు ప్రారంభించింది.
అమెరికాతో సంబంధాలు దెబ్బతినకుండానే తన చమురు అవసరాలను తీర్చుకుంటున్న భారత్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత విదేశీ నీతిని అన్ని దేశాలూ పొగుడుతున్నాయి. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతి సభలోనూ భారత విదేశాంగనీతిని ఆకాశానికెత్తేస్తున్నారు. పెద్ద టీవీలు, స్క్రీన్లు పెట్టి మరీ ఈ దృశ్యాలను పాకిస్థాన్ ప్రజలకు చూపిస్తున్నారు.
మోదీ-పుతిన్ మధ్య సంబంధాలు కూడా బలంగా ఉన్నాయి. యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్ధులను ఆ దేశం నుంచి స్వదేశానికి రప్పించడానికి పుతిన్ ప్రభుత్వంతో మోదీ సంప్రదింపులు జరిపారు. ఇది యుద్ధాల యుగం కాదంటూ మోదీ పుతిన్కు ఇచ్చిన సలహాను అమెరికా, యూరప్ దేశాలు ప్రశంసించాయి.
సంక్షోభాలను అవకాశాలుగా మలచుకున్న మోదీ-పుతిన్ తమ సొంత దేశాలకు ప్రయోజనం కలిగేలా చేస్తున్నారు. భారీ డిస్కౌంట్లో చమురు కొనుగోలు చేస్తూ భారత్ ప్రయోజనం పొందుతుండగా, అమెరికా, యూరప్ దేశాల ఆర్ధిక ఆంక్షల నుంచి బయటపడటానికి భారత్ రష్యాకు తోడ్పడుతోంది.
More Stories
భారత్కు క్షమాపణలు చెప్పిన మెటా సంస్థ
కేజ్రీవాల్పై ఈడీ విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
కుంభమేళాతో ఉత్తర ప్రదేశ్ కు రూ.2 లక్షల కోట్లు ఆదాయం