ఐటీ, ఐటీఈ రంగానికి సంబంధించి 56 ఒప్పందాలను కుదర్చుకున్నామని, వీటి విలువ రూ.25,587 కోట్లు అని చెబుతూ దానితో 1,04,442 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఇక, టూరిజంకు 117 ఎంఓయూలు కుదుర్చుకున్నామని, ఇందులో రూ.22,096 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా 30,787 మందికి ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఈ సదస్సు వేదికగా ఇవాళ రూ.3841 కోట్ల విలువైన 14 పారిశ్రామిక యూనిట్లను ప్రారంభిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. దీనివల్ల 9,108 మందికి ఉద్యోగాలు వస్తున్నాయని పేర్కొన్నారు. కింబర్లే క్లార్క్, బ్లూస్టార్, క్లైమాటెక్, లారస్ ల్యాబ్, హేవెల్స్ఇండియా, శారదా మెటల్స్ , అల్లాయిస్ తదితర కంపెనీలు ఈపెట్టుబడులను పెట్టాయి. ఈ కంపెనీలను ప్రారంభించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
గణనీయమైన పెట్టుబడులకు అవకాశాలు ఉన్న రంగాల్లో ఒకటి రెన్యువబుల్ఎనర్జీని పేర్కొంటూ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, పంప్డ్ స్టో్టరేజీ మరియు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి సంబంధించి వస్తున్న పెట్టుబడులు పునరుత్పాదక శక్తికి సంబంధించిన క్లిష్టతలను పూర్తిగా తగ్గిస్తాయని తెలిపారు.
శిలాజ ఇంధన ఆధారిత ఉత్పత్తికి విశ్వసనీయ ప్రత్యామ్నాయాన్ని చూపిస్తాయని పేర్కొన్నారు. కర్బన రహిత లక్ష్యంగా, గ్రీన్ఎనర్జీ దిశగా అడుగులేస్తున్న భారత్కు తన లక్ష్య సాధనలో చక్కటి సహకారాన్ని అందిస్తాయని చెప్పారు.
More Stories
ఏపీని అన్ని విధాలా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్’
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్గా విశ్వజిత్
వైసీపీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది