2024లో బీజేపీ-జ‌న‌సేన ప్ర‌భుత్వం ఏర్పాటు

2024లో బీజేపీ-జనసేన కలిసి ఆంధ్ రప్రదేశ్ లో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలోమాట్లాడుతూ  2014లోమోదీ అధికారంలోకి వచ్చాక ఏపీలో విద్యుత్ కోతలు తగ్గాయన చెప్పారు.
 
మోదీ అంటేనే అభివృద్ధి అని, మోదీ   అంటే అవినీతి రహిత వ్యక్తి అని ఆయన  కొనియాడారు. ఏపీలో చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు రెండూ కుటుంబ పాలన పార్టీలేనని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. కుటుంబ రాజకీయాలను బిజెపి ప్రోత్సహించదని స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధి లేని అప్పుల రాష్ట్రమ‌ని, అంతా అవినీతి మయం అంటూ ఆరోపించారు.

 రోజురోజుకు ఏపీ పరిస్థితి దిగజారుతోందని చెబుతూ  ఏమాత్రం అభివృద్ధి లేదని… అప్పులు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. గతంలో టిడిపి చేసిన మాదిరే ఇప్పుడు వైఎస్‌ఆర్‌సిపి అవినీతి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు.