జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. పుల్వామా జిల్లాలోని అవంతిపొరాలోని పడ్గంపొరాలో ఉగ్రవాదుల కోసం స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి.
ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ ముష్కరుడు చనిపోయాడని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నదని వెల్లడించారు. అతడు ఏగ్రూప్కు చెందినవాడనే విషయాన్ని గుర్తించాల్సి ఉందని చెప్పారు.
హతమైన టెర్రరిస్ట్ పుల్వామాకు చెందిన అకిబ్ముస్తాక్భట్గా పోలీసులు గుర్తించారు. పుల్వామా జిల్లా అవంతిపొరాలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దానితో గత అర్ధరాత్రి1:30 గంటలకు భద్రతా దళాలు ఎన్కౌంటర్ స్టార్ట్చేసి ముస్తాక్భట్ను మట్టుబెట్టాయి. మొదట్లో హిజ్బుల్ముజాహిదీన్ కోసం పనిచేసిన భట్.. ప్రస్తుతం ‘ది రెస్టిస్టెన్స్ఫ్రంట్’(టీఆర్ఎఫ్) అనే ఉగ్రవాద సంస్థలో పనిచేస్తున్నాడని, సంజయ్శర్మ అనే పండిట్ ను చంపిన టెర్రరిస్టుల్లో భట్ఉన్నట్లు గుర్తించామని కాశ్మీర్ అదనపు డీజీపీ తెలిపారు.
పుల్వామాలో కశ్మీరీ పండిట్ను ఉగ్రవాదుల కాల్చి చంపిన తర్వాత ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం. పుల్వామా జిల్లాలోని అచన్కు చెందిన సంజయ్ శర్మ అనే కశ్మీరీ పండిట్ ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి స్థానిక మార్కెట్కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొందరు ఉగ్రవాదులు ఆయనను ఛాతిపై కాల్చడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దవాఖానకు తరలించేలోపే ప్రాణం పోయింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2020 నుంచి 9 మంది పండిట్లను ఉగ్రవాదులు కాల్చి చంపారని స్థానికులు చెప్పారు.
More Stories
మణిపూర్ లో 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్
మణిపూర్లో మిలిటెంట్ల దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి
ఇక ఏడాదిలో రెండుసార్లు సీబీఎస్ఈ పరీక్షలు