దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ ఎంపిక చేసిన పలు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. 5 నుంచి 25 బేసిస్ పాయింట్ల వరకు పెరిగినట్టు, సవరించిన రేట్లు ఫిబ్రవరి 15, 2023 నుంచే అమల్లోకి వచ్చినట్టు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ పేర్కొంది. రూ.2 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటు వర్తిస్తుందని వెల్లడించింది.
కాగా చివరిసారిగా డిసెంబర్ 13, 2022న ఎంపిక చేసిన పలు ఫిక్స్డ్ డిపాజిట్లపై 65 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను పెంచింది. దాదాపు రెండు నెలల తర్వాత వడ్డీ రేట్లు పెంచడం మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. 400 రోజుల కాలపరిమితితో కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ టెన్యూర్ను ఎస్బీఐ ప్రవేశపెట్టింది. అయితే ఇది పరిమితికాలపు ఆఫర్. ఫిబ్రవరి 15, 2023న మొదలై మార్చి 31, 2023తో ముగిసిపోనున్న ఈ ఫిక్స్డ్ డిపాజిట్పై 7.10 శాతం వడ్డీ రేటు వర్తించనుందని స్పష్టం చేసింది.
More Stories
చైనాలో ఆర్థిక సవాళ్లు నిజమేనన్న జిన్పింగ్
ఏప్రిల్లో గరిష్ట స్థాయికి చేరిన జీఎస్టీ వసూళ్లు
బాబా రాందేవ్కు సుప్రీంకోర్టు ప్రశంసలు