పర్యావరణంపై అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలైన మొక్కలు నాటడం, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ దినోత్సవాలు నిర్వహించడం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై కెపాసిటీ బిల్డింగ్ వంటి వాటిలో విద్యార్థుల భాగస్వామ్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఒక్కో క్లబ్కు 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిందని తెలిపారు.
ఈఈఏటీ స్కీంను 2022-23లో ఈఈపీ (ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్, ప్రోగ్రాం) పేరుతో పునరుద్ధరించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈఈపీ కింద ఇప్పటికే ఏర్పాటు చేసిన ఎకో క్లబ్ లతో పాటు యూత్ క్లబ్బులు, వివిధ ప్రభుత్వ స్కీంల కింద ఏర్పాటు చేసిన క్లబ్బులు, యూనిట్లు, గ్రూపుల సభ్యలకు పర్యావరణ అంశాలపై అవగాహన కల్పించడం చేస్తారు.
అదేవిధంగా, పర్యావరణం పై వర్క్ షాప్ లు, ఎగ్జిబిషన్ లు, అవగాహన సదస్సులు, కాంపిటీషన్లు నిర్వహించడం, నేచర్ క్యాంపులు, వేసవి క్యాంపులు వంటి కార్యక్రమాలు నిర్వహించి స్థిరమైన జీవన విధానాన్ని అలవర్చడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు.
More Stories
పోలవరం పునరావాసంకు `ప్రత్యేక సెస్’
మహిళలు, రైతులు, నిరుద్యోగులపై కూటమి వరాల జల్లు
నామినేషన్లకు గడువు ముగింపు… పోటీలో అభ్యర్థులు ఖరారు