డాక్యుమెంటరీ లో పాపన్న చరిత్రను చారిత్రక ఆధారాలతో చూపించారు. ఆయన నిర్మించిన కోటలు, జయంచిన కోటలు అన్ని అద్భుతంగా చూపించారు. అంతర్జాతీయ స్ఠాయిలో పాపన్న చరిత్రను మరోసారి బయటకు తీసుకువచ్చిన డాక్యుమెంటరీ ఇది. 18వ శతాబ్ధంలో జె ఎ బోయల్ ఆయన చనిపోయిన 2 శతాబ్ధాల తర్వాత ప్రజల నాలుకల మీద నుంచి ఏరి పాపన్న చరిత్రను వెలికి తీశాడు. ఆయన తర్వాత రిచ్చర్డ్ ఈటెన్ దక్షిణాది సామాజిక రాజకీయ విప్లవ యోధుడి చరిత్రను ఆధారాలతోసహా ప్రపంచం ముందుకు తీసుకు వచ్చారు.
పాపన్న వరంగల్ జిల్లా ఖిలాషపూర్ తాటికొండ గ్రామంలో 1650 ఆగష్టు 18న పుట్టారు. తండ్రి చిన్నప్పుడే మరణించడంతో తల్లి సర్వమ్మ అన్నీ తానై పెంచింది. జమిందారుల అరాచకాలను, కుల వివక్షను, కొన్ని కులాలే పాలించే సంస్కృతి పట్ల చిన్నతన్నంలోనే పాపన్నకు ఆలోచన మొదలైంది. పరాయి పాలనలో బానిసలుగా బతకడం కంటే ధిక్కరించి స్వయంపాలన చేసుకుందాం అని పాపన్న నినదించాడు.
సామాజిక వ్యవస్థ గురించి ఒక స్పష్టమైన ఆలోచనలతో, సిద్ధాంతంతో ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. గౌడ వృత్తిలోనే నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. అనేక కులాలను సమన్వయం చేయడమే కల్లుగీత వృత్తి లక్షణమన్నారు. ఒక్క గౌడ కులంలోనే కాదు ప్రతి కులంలోనూ నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పారు.
రాజ్యం ఎవరి సొత్తు కాదని ప్రజల భాషలో వివరించారు. పాపన్న తిరుగుబాటు చేసింది రాజ్యం మీద కాదు రాజ్య స్వభావం మీద. ఆధిపత్య సంస్కృతి మీద. పాపన్న భౌద్ధ సంస్కృతికి పట్టం కట్టాడు. అప్పటికే ఉన్న గుడులలో కూడా దళిత బహుజనులకే అప్పజెప్పాడు. గ్రామదేవతల సంస్కృతిని తిరిగి బతికించాడు.
బౌద్ధ రాజ్యం అంటే రాజ్య సంపదలో అందరికీ వాటా ఉండటమే. బహుజన రాజ్యం అంటే పరిపాలనలో అందరికీ సమాన హక్కును కల్పించడమే. ఈ సాంప్రదాయాలను పాపన్న మొదటి నుంచి పాటిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ స్థానికంగా స్థిరపడిన జమీన్ దారులు మొఘల్ పాలకులకు తప్పుడు సమాచారాన్ని ఇస్తూ వచ్చారు. కింది కులం నుంచి వచ్చిన పాపన్న ఎదుగుదలను జీర్ణించుకోలేకపోయారు.
More Stories
దిశ ఎన్కౌంటర్ కేసులో హైకోర్టులో పోలీసులకు ఊరట
ఢిల్లీ పోలీసులను 4 వారల గడువు కోరిన రేవంత్ రెడ్డి
ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు