భారత్ను వంద ముక్కలుగా చూడాలనుకునే వారు కలత చెందుతున్నారని, అందుకే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. మన దేశాన్ని చీకట్లో చూడాలనుకునే వారి కుట్రలే ఇవి అని ధ్వజమెత్తారు. న్యాయవ్యవస్థ తీర్పుల కన్నా.. ఆ డాక్యుమెంటరీని నమ్ముతున్న వారిని చూసి తాను చింతిస్తున్నానని ప్రతిపక్షాలను ఉద్దేశించి పేర్కొన్నారు.
“గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీని రూపొందించినవారు భారతదేశంలో వందల సంవత్సరాల బ్రిటీష్ పాలనలో జరిగిన దురాగతాలను ఎందుకు వీడియోలు తీయలేదు?” అని ఆయన బీబీసీని ప్రశ్నించారు.భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా బాగా రాణిస్తోందని, దీంతో విదేశీ డాక్యుమెంటరీ నిర్మాతలు నిరాశకు గురయ్యారని మండిపడ్డారు.
“ఇది భారతదేశం జీ20 అధ్యక్ష పదవిని చేపట్టిన సమయం. ఈ డాక్యుమెంటరీని తీసుకురావడానికి ఈ నిర్దిష్ట సమయాన్నే ఎందుకు ఎంచుకున్నారు?” అని కేరళ గవర్నర్ నిలదీశారు. భారతదేశం పేద దేశం కాదని, భారతదేశ సంపదపై అత్యాశతో బయటి వారు ఇక్కడికి వచ్చారని ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తెలిపారు. వీరి కారణంగానే 1947 నాటికి మనం దక్షిణాసియాలో పేదరికానికి చిహ్నంగా మారామని, అయితే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు.
ప్రస్తుతం భారతీయులు ప్రపంచంలోని అనేక పెద్ద బహుళజాతి కంపెనీల్లో ఉన్నత పదవుల్లో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. దీన్ని బట్టే ప్రపంచం భారత్ సామర్థ్యాన్ని గుర్తిస్తున్నదని పేర్కొన్నారు. “చరిత్ర నుండి ప్రపంచానికి తెలుసు .. మనం శక్తివంతంగా ఉంటె ప్రపంచంలో మరెవ్వరు మనపై కన్నెత్తి చూడలేరు” అని స్పష్టం చేశారు.
More Stories
రాహుల్ గాంధీ `పాకిస్తాన్ అనుచరుడు’
బ్రిజ్ భూషణ్ సింగ్ కు బిజెపి సీట్ నిరాకరణ!
అయోధ్య రామమందిరంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు