అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఉన్న నిషేధాన్ని ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎత్తివేశాయి. 2021లో యూఎస్ క్యాపిటల్పై జరిగిన దాడి తర్వాత ఆయనను నిషేధించాయి. అయితే రెండేండ్ల తర్వాత ఆయన అకౌంట్లను పునరుద్ధరిస్తున్నట్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ల మాతృసంస్థ మెటా ప్రకటించింది. వార్తలకు మాధ్యమంగా సోషల్ మీడియా మారుతున్నందున రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారో ప్రజలకు తెలియాల్సి అవసరం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు.
అది మంచైనా, చెడైనా అంటూ బ్లాగ్ స్పాట్ వేదికగా వెల్లడించింది. ప్రజలు బ్యాలట్ బ్యాక్స్ ద్వారా తమ చాయిస్ను తెలపొచ్చని పేర్కొన్నది. 2021లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి అనంతరం దేశంలో పెద్దఎత్తున హింసాకాండ చెలరేగింది. ఆయన మద్దతుదారులు 2021 జనవరి 6న యూఎస్ క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించారు. వారిని రెచ్చగొట్టే విధంగా ట్రంప్ వ్యవహరించారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఆ సమయంలో సోషల్ మీడియా ద్వారా ట్రంప్ ప్రజల్ని ప్రభావితం చేస్తున్నాడన్న కారణంతో మెటా ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్లన్నింటినీ బ్యాన్ చేసింది. ట్విట్టర్ సైతం ట్రంప్ అకౌంట్ ను బ్యాన్ చేయగా.. ఇటీవలే దాన్ని పునరుద్దరించింది. 2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయనున్నారు.
More Stories
అమెరికా లేకపోతే ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?
ఐరోపా వెళ్లే భారతీయులకు వీసా సులభం
తైవాన్ లో గంటల వ్యవధిలో 80 సార్లు కంపించిన భూమి