ప్రపంచకప్ హాకీలో ఆతిథ్య భారత్ శుభారంభం చేసింది. శుక్రవారం రూర్కేలాలోని బిర్సాముండా స్టేడియంలో స్పెయిన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 20 తేడాతో ఘన విజయం సాధించింది. ఆరంభం నుంచే భారత్ దూకుడుగా ఆడింది. ఆట 12వ నిమిషంలోనే వైస్ కెప్టెన్ అమిత్ రోహిదాస్ భారత్కు తొలి గోల్ అందించాడు.
ఆ తర్వాత భారత్ మరింత చెలరేగి ఆడింది. 26వ నిమిషంలో హార్దిక్ సింగ్ భారత్కు రెండో గోల్ సాధించి పెట్టాడు. దీంతో ప్రథమార్ధం ముగిసే సమయానికి భారత్ 20 ఆధిక్యంలో నిలిచింది. అయితే ద్వితీయార్ధంలో స్పెయిన్ ఎటాకింగ్ గేమ్ ఆడింది. పదేపదే భారత్ గోల్ పోస్ట్ వైపు దాడులు చేసింది. అయితే గోల్స్ సాధించడంలో మాత్రం విఫలమైంది.
కాగా, చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన భారత్ మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ 3 పాయింట్లను సాధించింది. ఇక శుక్రవారం జరిగిన ఇతర పోటీల్లో ఇంగ్లండ్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా జట్లు విజయం సాధించాయి. ఇంగ్లండ్ 50 తేడాతో వేల్స్ను ఓడించింది. 15న భారతజట్టు ఇంగ్లండ్తో తలపడనుంది. ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వడం ఇది వరుసగా రెండోసారి.
ఇక హోరాహోరీగా సాగిన మ్యాచ్లో అర్జెంటీనా 10 తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. కాగా, ఫ్రాన్స్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 80 భారీ తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఒడిశా వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచ కప్ లో మొత్తం 16 జట్లు బరిలోకి దిగాయి.
పాకిస్తాన్ మాజీ క్యాప్టియన్ ప్రశంసలు
తొలి మ్యాచ్లో గెలిచిన భారత జట్టుపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ హసన్ సర్ధార్ ప్రశంసలు కురిపించాడు. హర్మన్ ప్రీత్ కెప్టెన్సీలోని టీమిండియా ప్రధాన జట్లకు ఏమాత్రం తీసిపోదని అతను అభిప్రాయపడ్డాడు. ‘హాకీలో గోల్ కొట్టడమనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం భారత జట్టుకు గోల్ స్కోర్ చేయగల సత్తా ఉంది. అంతేకాదు ఈ జట్టు చాలా పరిణితితో, విజయమే లక్ష్యంగా ఆడుతోంది’ అని కొనియాడారు.
`ఈ టీమ్ పతకాలు కొల్లగొట్టగలదు. ఈ టోర్నీలో ఆడుతున్న నాలుగు ప్రధాన జట్లు అయిన ఆస్ట్రేలియా, బెల్జియం, నెదర్లాండ్స్, భారత్ మధ్య పెద్ద తేడా ఏం లేదు’ అని సర్దార్ పేర్కొన్నాడు. 1970, 80ల్లో పాక్ జట్టులో సర్దార్ కీలక ఆటగాడు. ముంబైలో 1982లో జరిగిన వరల్డ్ కప్లో 11 గోల్స్ చేశాడు.
More Stories
జమ్మూకాశ్మీర్లో భారీ ఉగ్రదాడి.. ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై కాల్పులు
వన్డేలు, టీ20లో అగ్రస్థానంలో టీమ్ఇండియా
సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరిస్తే చర్యలు