పాకిస్థాన్కు చెందిన ఒక ఓటీటీ టీవీ ఛానెల్పై భారత్ నిషేధం విధించింది. భారతదేశానికి వ్యతిరేకంగా వెబ్సిరీస్ను రూపొందించారనే కారణంతో విడ్లి టివి ఓటీటీని సోమవారం బ్యాన్ చేసింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఆ వెబ్సైట్కు సంబంధించిన రెండు మొబైల్ యాప్స్, నాలుగు సోషల్మీడియా ఖాతాలను ఐటీ చట్టం 2021 ప్రకారం నిషేధించింది. విడ్లి సంస్థ తాజాగా “సేవక్: ది కన్ఫెషన్” అనే వెబ్ సిరీస్ రూపొందించింది. ఈ వెబ్ సిరీస్ భారత దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమధికారానికి, విదేశాలతో భారత స్నేహ సంబంధాలకు హాని చేసే విధంగా ఉందని ఆ ప్రకటనలో పేర్కొంది.
సేవక్ వెబ్సిరీస్ ప్రారంభంలోనే భారత జాతీయ జెండాలోని అశోక చక్రం మంటల్లో తగలబడుతున్న సీన్ వస్తుంది. అంతేకాదు భారతదేశానికి సంబంధించిన సున్నితమైన అంశాలను ఇందులో వక్రీకరించి చూపించారు. ఈ వెబ్సిరీస్లో భారతదేశాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేశారు. చరిత్రను తప్పుదోవ పట్టించేలా తెరకెక్కించారు.
భారతప్రభుత్వం స్వర్ణ దేవాలయంలో చేపట్టిన ఆపరేషన్ బ్లూస్లార్, ఆ తర్వాతి సంఘటనలు, బాబ్రీ మసీద్ కూల్చివేత, మాలేగావ్ పేలుళ్లతో పాటు సట్లెజ్, యమునా నది మధ్య వివాదం గురంచి కూడా వెబ్సిరీస్లో తప్పుగా చూపించారని కేంద్ర సమాచార శాఖ పేర్కొంది.
More Stories
ఉత్తరాఖండ్ అడవుల్లో ఆగని మంటలపై `సుప్రీం’ మండిపాటు
ఎన్నికల వేళ పాక్ సరిహద్దులో 49 డ్రోన్లు స్వాధీనం
విపత్తుల ఫలితంగా భారత్ లో 5 లక్షల మంది నిరాశ్రయం