
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఐఎస్ఆర్ఓ) ఈ నెల 24న పీఎస్ఎల్వీ సీ-54 ప్రయోగం చేపట్టనున్నది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని స్పేస్సెంటర్ రాకెట్ను నింగిలోకి పంపనున్నది. ఓషన్శాట్-3 సహా ఎనిమిది నానో ఉపగ్రహాలను సీ-54 రాకెట్ కక్షలో ప్రవేశపెట్టనున్నది.
శనివారం ఉదయం 11.56 గంటలకు ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. ఓషన్శాట్-3తో పాటు భూటాన్ శాట్, ఆనంద్, ధ్రువ స్పేస్ నుంచి రెండు టైబోల్ట్ శాటిలైట్లను, నాలుగు ఆస్ట్రోకాస్ట్ శాటిలైట్లను ఇస్రో నింగిలోకి పంపనున్నది.
ఓషన్శాట్ భూ పరిశీలన ఉపగ్రహం కాగా.. ఇప్పటికే ఓషన్శాట్ సిరీస్లో ఓషన్శాట్-1, ఓషన్శాట్-2 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ప్రస్తుతం ఈ సిరీస్లో మూడో ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు.
సముద్రం, వాతావరణాన్ని అధ్యయనం చేస్తూ.. తుఫానుల అంచనా వేయడానికి ఓషన్శాట్ సిరీస్ శాటిలైట్స్ ఉపయోగపడుతున్నాయి. ఇదే సిరీస్లో ఓషన్శాట్-3ఏ ఉపగ్రహాన్ని వచ్చే ఏడాదిలో నింగిలోకి పంపనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి.
More Stories
గుంటూరు ఆసుపత్రిలో జిబిఎస్ తో ఓ మహిళ మృతి
అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత
విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ఆలోచనే లేదు