రూపాయి విలువ క్షీణత సగం భారతీయ కంపెనీలకు లాభదాయకం

అంతర్జాతీయ ప్రతికూలత కారణంగా డాలర్‌తో రూపాయి విలువ క్షీణిస్తూ ఉండడంతో మనం ఆందోళన చెందుతుంటే, దాదాపు సగం భారతీయ కంపెనీలకు మాత్రం అది లాభదాయకంగా మారింది. ఈ మేరకు ఎస్‌అండ్‌పి గ్లోబల్‌ రేటింగ్స్‌ గురువారం వెల్లడించింది. ”మా రేటింగ్‌ పొందిన ఇండియా కార్పొరేట్‌ పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ భాగం యూఎస్‌-డాలర్‌ లింక్డ్‌ రాబడిని కలిగి ఉంది. అందువల్ల రూపాయి క్షీణతకు గురి కాదు. ఇది ఐటీ, మెటల్స్‌, కెమికల్స్‌ రంగాలలోని సంస్థలను కలిగి ఉంటుంది.” అని తెలిపింది.

తాము  రేట్‌ చేసే దాదాపు సగం సంస్థలు కరెన్సీ బలహీనతల నుంచి లాభం పొందుతున్నాయి అని రేటింగ్‌ ఏజెన్సీ ఒక నివేదికలో పేర్కొంది. ఎబిడిటా లేదా వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనకు ముందు ఆదాయాలు అనేది కంపెనీ నిర్వహణ లాభదాయకతకు కొలమానం. దేశీయంగా నడిచే రంగాలు, టెలికాం వంటివి కూడా తమ హోడ్జింగ్‌ విధానాల కారణంగా రూపాయి విలువ క్షీణతను తట్టుకోగలవని ఆ ఏజెన్సీ పేర్కొంది.

”భారతి ఎయిర్‌టెల్‌ కనీసం రాబోయే 12 నెలల్లో ఈ రుణంపై బాకీ ఉన్న డాలర్‌ డెట్‌లో సగం ప్రిన్సిపల్‌ను దాని మొత్తం వడ్డీ ఖర్చులను మార్చుకుంది” అని నివేదిక తెలిపింది. విప్రో, ఇన్ఫోసిస్‌, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ వంటి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సంస్థలు డాలర్‌లలో సేవలను ఎగుమతి చేస్తాయి. అయితే వాటి ఖర్చులు ఎక్కువగా రూపాయిలో ఉన్నాయి. అందువల్ల రూపీ బలహీనత వీటికి అత్యంత లాభదాయకం.

”వేదాంత రిసోర్సెస్‌ వంటి స్థానిక లోహాల సంస్థలు కూడా ఆదాయ లాభాలను పొందుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి పడిపోయిన ప్రతిసారీ వార్షిక ఎబిడిటా సుమారు 50 మిలియన్‌ డాలర్లు పెరుగుతుందని కంపెనీ మార్గనిర్దేశం చేసింది” అని ఎస్‌ఎఅండ్‌పి తెలిపింది.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎంటిటీలు భారతీయ కార్పొరేట్‌లలో కరెన్సీ రిస్క్‌కు ఎక్కువగా గురవుతాయని మరియు ముఖ్యంగా పునరుత్పాదక సంస్థలు అధిక క్యాపెక్స్‌ వ్యయం, డాలర్‌ రుణంపై ఎక్కువగా ఆధారపడతాయని పేర్కొంది.

”బల#హనమైన ఆఫ్‌షోర్‌ ఫండింగ్‌ మార్కెట్‌లను నిర్వహించడానికి ఇప్పటికీ సహాయక ఆన్‌షోర్‌ ఫండింగ్‌ వాతావరణం కూడా భారతీయ కంపెనీలకు సహాయపడింది. కీలకమైన ఆన్‌షోర్‌ బెంచ్‌మార్క్‌ రేట్లు ఈ సంవత్సరం వరకు దాదాపు 200 బేసిస్‌ పాయింట్లు పెరిగాయి. ఇది చాలా ఆఫ్‌షోర్‌ మార్కెట్లలో కనిపించిన దానికంటే తక్కువగా ఉంది.