హిమాలయ పర్వత శ్రేణుల్లోని నేపాల్ను వరుస భూకంపాలు వణికించాయి. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు నేపాల్లో 6.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.6గా నమోదైంది.
24 గంటల వ్యవధిలో రెండు సార్లు భూ ప్రకపంనలు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంపం ధాటికి దోతి జిల్లాలో ఓ ఇల్లు కూలిపోవడంతో ఆరుగురు మృత్యువాతపడ్డారు.
చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. భూకంపం కారణంగా ఆరుగురు చనిపోవడంపై నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ స్పందించారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు ట్వీట్ చేశారు.
భూకంపం ధాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. రంగంలోకి దిగిన ఆర్మీ సహాయక చర్యలు చేపడుతోంది. నేపాల్ దోతి జిల్లాలో మంగళవారం సైతం 4.5 తీవ్రతతో భూమి కంపించింది.
దీంతో పక్కనే ఉన్న ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఢిల్లీ రాజధాని ప్రాంతాల్లో కూడా భూమికంపించింది. దీనిప్రభావంతో ఢిల్లీ, ఢిల్లీ రాజధాని ప్రాంతంలోని ఘజియాబాద్, గురుగ్రామ్, ఉత్తరాఖండ్లోని పితోరాగఢ్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో గాఢ నిద్రలో ఉన్న ఢిల్లీ ప్రాంత ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
ఉత్తరాఖండ్లోని పితోరాగఢ్లో మరోసారి భూమి కంపించింది. బుధవారం ఉదయం 6.27 గంటలకు 4.3 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూఅంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని పేర్కొన్నది. కాగా, గత పదేండ్లలో ఉత్తరాఖండ్లో 7 వందల సార్లు భూకంపాలు సంభవించాయని నిపుణులు తెలిపారు
More Stories
ఇజ్రాయిల్ లో `అల్జజీరా’ కార్యాలయాల మూసివేత
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్
భారత్ కు బంగ్లాదేశ్ లో టి20 మహిళా క్రికెట్ సిరీస్