సాధువుగా మారిన చైనా మహిళ అరెస్ట్

సాధువు అవతారం ఎత్తింది ఓ మహిళ. నేపాల్ నుంచి తాను వచ్చానని టిబెట్ శరణార్థుల క్యాంప్ లో ఆశ్రయం పొందుతోంది ఆ మహిళ.. కాగా అధికారుల విచారణలో ఆమె చైనాలో పుట్టిపెరిగిందని, మూడేళ్ల క్రితం భారతదేశానికి వచ్చిందని తేలింది. దీంతో సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అభియోగాలపై ఆమెను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బౌద్ధ సన్యాసిగా జీవిస్తూ చైనా తరుపున భారత ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు, మంత్రులపై గూఢచర్యం చేస్తుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెను చైనాలోని హెనాన్ ప్రావిన్సుకు చెందిన కైరువోగా పోలీసులు గుర్తించారు.

డోల్మా  లామాగా పేరు మార్చుకుని బౌద్ధ సన్యాసిగా జీవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తర ఢిల్లీలోని టిబెటన్ శరణార్థుల కాలనీ మజ్ను కా తిలాలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నేపాల్ పౌరసత్వ ధృవీకరణ పత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో విచారించినప్పుడు సదరు మహిళ చైనా పౌరురాలని తేలిందనచెబుతున్నారు.

ఇంగ్లీష్, నేపాలీ, చైనీస్ భాషల్లో మహిళ మాట్లాడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.టిబెట్ నుంచి భారత దేశానికి వచ్చిన శరణార్థుల కోసం ఢిల్లీలో మంజు కా టిల్లా పేరుతో ప్రభుత్వం ఓ క్యాంప్ నిర్వహిస్తోంది. ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్ కు సమీపంలో ఉందీ క్యాంప్.  విదేశీ పర్యాటకులు ఎక్కువగా ఉండే ప్రాంతంగా దీనికి పేరుంది. ఇక్కడ ఉండే వాళ్లను పోలీసులు నిరంతరం ఓ కంట కనిపెడుతుంటారు. సాధువు రూపంలో ఉన్న ఈ మహిళ కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు ఆమెను విచారించారు. 

నేపాల్ లోన్ ఖాట్మండులో తను పుట్టిపెరిగానని చెబుతున్న ఆ మహిళ నిజానికి చైనా పౌరురాలని విచారణలో తేలింది. ఆమె అసలు పేరుకై రుయో అని, 2019లో చైనా నుంచి భారత్ లో అడుగుపెట్టిందని వెల్లడైంది.  దీంతో ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. చైనాలోని కమ్యూనిస్టు లీడర్లతో తనకు ప్రాణభయం ఉందని, అందుకే మారుపేరుతో భారత్ లో తలదాచుకుంటున్నానని చెప్పింది.