1990 నుంచి ఎప్పుడు ఎన్నికలు జరిగినా గుజరాతీ ప్రజలు బీజేపీని గెలిపిస్తూ వస్తున్నారని చెబుతూ ఈ విజయాల్లో ప్రవాస గుజరాతీలు (ఎన్ఆర్జీ) కీలకంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్షా తెలిపారు.
మూడురోజుల ‘ప్రవాసి గుజరాతి పర్వ్ 2022’ ప్రారంభోత్సవానికి హాజరైన వారిని ఉద్దేశించిన అమిత్షా శనివారంనాడు వర్చువల్ పద్ధతిలో ప్రసంగిస్తూ రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొంటూ బిజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని రాష్ట్రంలోని గ్రామగ్రామాలకు చేరవేయాలని కోరారు.
గుజరాతీలు ఎక్కడ ఉన్నా ఆ దేశానికి పేరు ప్రతిష్ఠలు తెస్తుంటారని, కేవలం దేశాభివృద్ధికే కాకుండా ప్రపంచాభివృద్ధిలో గణనీయ పాత్రను పోషిస్తున్నారని అమిత్షా కొనియాడారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అభివృద్ధిని కొత్తపుంతలు తొక్కించారని, ఆనువంశిక పాలన, కులతత్వం, బుజ్జగింపు రాజకీయాలకు చరమగీతం పాడి ఎలక్టోరల్ పాలిటిక్స్పై ప్రజలకు నమ్మకాన్ని పెంచారని ఆయన పేర్కొన్నారు.
సంక్షోభ సమయాన్ని కూడా ఒక అవకాశంగా ఎలా మలుచుకోవాలో, శాంతి భద్రతలను మెరుగుపరిచి కర్ఫ్యూ రహిత పరిస్థితిని ఎలా తీసుకురావాలో, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో ఎలా పెకిలించాలో మోదీ చేసి చూపించారని ఆయన గుర్తు చేశారు. దేశ సంస్కృతీ వారసత్వాన్ని గర్వంగా ప్రపంచదేశాలకు చాటారని అమిత్షా తెలిపారు. గుజరాత్ అభివృద్ధికి కట్టుబడి బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని భరోసా ఇచ్చారు.
గుజరాత్కు విశ్వవ్యాప్త గుర్తింపును మోదీ తీసుకువచ్చారని చెబుతూ . ఈ ప్రయాణాన్ని మనమంతా కలిసి ముందుకు తీసుకువెళ్లాలని ఎన్ఆర్జీలను కోరారు. దేశాభివృద్ధికి కోసం పార్టీ, ప్రధానమంత్రి చేస్తున్న కృషిని గ్రామగ్రామానికి తీసుకువెళ్లే బీజేపీ అంబాసిడర్లు కావాలని ప్రవాస గుజరాతీయలకు ఆయన పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ది విద్వేషం.. మాది అభివృద్ధి మంత్రం
కాగా, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కాంగ్రెస్ పని అయితే, రాష్ట్రాలను అభివృద్ధి చేయడం బీజేపీ పని అని అమిత్ షా తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్న ఆయన… సిర్మౌర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ హిమాచల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో పరివార్ వాదాన్ని అంతం చేశామని షా చెప్పారు.
అధికార కాంక్షతో మన వారసత్వాన్ని కాంగ్రెస్ గౌరవించలేక పోయిందని ఆయన విమర్శించారు. గిరిజన హోదా కోసం 55 ఏండ్లుగా హాతి వర్గం చేస్తున్న పోరాటానికి ప్రధాని నరేంద్ర మోదీ ముగింపు పలికారని గుర్తు చేశారు. దేశంలో వారసత్వ రాజకీయాలకు నరేంద్ర మోదీ నేతృత్వంలో బిజెపి ముగింపు పలికిందని చెబుతూ గతంలో కనీసం ఊహించడానికి సహితం వీల్లేని ఆర్టికల్ 370 రద్దు, రామాలయ నిర్మాణం వంటి సాహసోపేత కార్యాలయాలను మోదీ ప్రభుత్వం సాధ్యం చేసినదని ఆయన చెప్పారు.
దేశంలో రాచరిక పరిపాలన రోజులు పోయాయని పేర్కొంటూ అందుకనే ఢిల్లీలో `రాజపత్’ పేరును `కార్యపాత్’ గా మార్చడమే కాకుండా, భవ్యమైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించ చేసుకున్నామని అమిత్ షా గుర్తు చేశారు.
More Stories
తెలంగాణలో ‘గాడిద గుడ్డు’ పాలన
వేముల రోహిత్ దళిత్ కాదు…. కేసు మూసివేత
బిజెపి-ఎన్డిఎ తప్ప మరెవ్వరు ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు