
దేశంలో మరో వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇప్పటికే మూడు వందే భారత్ రైళ్లు ప్రారంభం కాగా, గురువారం ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ – ఉనాలోని అంబ్ అందౌరా స్టేషన్ వరకు నడిచే నాల్గో వందే భారత్ రైళ్లును ప్రారంభించారు.
ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లోని అందౌరా రైల్వే స్టేషన్ మధ్య నడిచే ఈ రైలును ఉనా జిల్లాలో ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీ-ఉనా మధ్య అందుబాటులోకి వచ్చే ఈ వందే భారత్ రైలు వల్ల పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా వాసులకు చాలా ప్రయోజనం ఉంటుంది.
ఇది కేవలం 52 సెకన్లలో గంటకు100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.
కాగా, ఈ కార్యక్రమంలో హిమాచల్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్రమంత్రి, హమీపూర్ ఎంపీ అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ‘‘ఢిల్లీ-ఉనా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు వల్ల పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా ప్రజలకు ఎంతో ప్రయోజనం.. ఢిల్లీ లేదా ఇతర నగరాలకు వెళ్లే హరియాణా వాసులకు ఈ రైలు వల్ల ఎంతో మేలు జరుగుతుంది’’ అని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ రైలు ఉదయం 5.50 గంటలకు న్యూ ఢిల్లీ నుంచి బయలుదేరి, ఉదయం 11.05 గంటలకు అంబ్ అందౌరా స్టేషన్ కు చేరుకుంటుంది. మళ్లీ మధ్యాహ్నం అక్కడ నుంచి బయలుదేరి 6.25 గంటలకు న్యూ ఢిల్లీకి చేరుకోనుంది. బుధవారం మినహా వారానికి ఆరు రోజులు ఈ రైలు సేవలు అందుబాటులో ఉంటుంది.
మరోవైపు చెన్నై- మైసూరు మధ్య ఐదవ వందే భారత్ రైలును ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ గత నెలలో మూడో వందే భారత్ రైలును ప్రారంభించారు. గాంధీ నగర్-ముంబై మార్గంలో ఈ రైలు నడుస్తోంది.
అయితే ఇది ప్రమాదానికి గురికావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే దీనికి రిపేర్ చేసి ట్రాక్ మీదకు తీసుకొచ్చారు.
More Stories
క్రమేపీ తగ్గిపోతున్న నోటా ఓట్ల శాతం
ట్రంప్తో భేటీలో ప్రధాని హుందాగా నడుచుకున్నారు
మమతా కులకర్ణి రాజీనామా తిరస్కరణ