సీజేఐగా జ‌స్టిస్ చంద్ర‌చూడ్ పేరును ప్ర‌తిపాదించిన జ‌స్టిస్‌ ల‌లిత్‌

50వ భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ పేరును సీజేఐ యూయూ ల‌లిత్ ప్ర‌తిపాదించారు. చీఫ్ జ‌స్టిస్ యూయూ ల‌లిత్ న‌వంబ‌ర్ 8వ తేదీన రిటైర్ కానున్నారు. ఈ నేప‌థ్యంలో త‌దుప‌రి సీజే పేరును వెల్ల‌డించాల‌ని కోరుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు  అక్టోబర్ 7న ప్రస్తుత జ‌స్టిస్ ల‌లిత్‌కు లేఖ వ్రాసారు. 

రిటైర్ కావ‌డానికి నెల రోజుల ముందే సీజేఐ కాబోయే చీఫ్ జ‌స్టిస్ పేరును సిఫార‌సు చేయాల్సి ఉంటుంది. ఆ నియ‌మం ప్ర‌కార‌మే మంగళవారం  సీజేఐ యూయూ ల‌లిత్‌ త‌దుప‌రి సీజే పేరును ప్ర‌క‌టించారు. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తుల ముందే సిఫార‌సు లేఖ‌ను ఆయ‌నకు అంద‌జేశారు. ఈ విధంగా బహిరంగంగా సిఫార్సు లేఖను అందజేసే సంప్రదాయాన్ని ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన జస్టిస్ ఎన్ వి రమణ ప్రారంభించారు. 

జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ సుప్రీంకోర్టులో రెండ‌వ సీనియ‌ర్ లాయ‌ర్‌. ఆయ‌న పేరును త‌దుప‌రి సీఐగా ప్ర‌తిపాదిస్తూ రాసిన లేఖ‌ను జ‌స్టిస్ ల‌లిత్ కేంద్రానికి పంపారు. ఒవ‌కేళ జ‌స్టిస్ ల‌లిత్ చేసిన ప్ర‌తిపాద‌న‌ను కేంద్రం అంగీక‌రిస్తే, అప్పుడు జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ రెండేళ్ల పాటు సీజేఐగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తారు. న‌వంబ‌ర్ 10, 2024లో ఆయ‌న రిటైర్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

ఆయన 1998లో అదనపు సొలిసిట్ జనరల్ గా పనిచేశారు. 2013లో అలహాబాద్ హైకోర్టు  ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ముంబై హైకోర్టులో కూడా పనిచేశారు. సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా 2016లో పదవోన్నతి పొందారు. 

జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ తండ్రి జ‌స్టిస్ వైవీ చంద్ర‌చూడ్ భార‌త 16వ సీజేఐగా చేశారు. ఆయ‌న ఫిబ్ర‌వ‌రి 2, 1978 నుంచి జూలై 11, 1985 వ‌ర‌కు సీజేఐగా చేశారు.