ఐసీసీ విడుదల చేసిన టీ 20 ర్యాంకింగ్స్లో 837 పాయింట్లతో రెండో స్థానం నిలిచాడు టీమ్ ఇండియా ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. మొదటి స్థానంలో 854 పాయింట్లతో పాకిస్తాన్కు చెందిన ప్లేయర్ మహమ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. మొదటి స్థానం వస్తుందని ఆశించినా, దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్లో చేసిన పేలవ ప్రదర్శనతో మొదటి స్థానం చేజార్చుకున్నాడు.
రిజ్వాన్కు సూర్యకు మధ్య కేవలం 16 పాయింట్ల తేడా ఉంది. ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్లో అద్భుత ప్రదర్శన చేశాడు సూర్యకుమార్ యాదవ్. మూడుమ్యాచ్ల్లో రెండు అర్థ శతకాలు సాధించాడు. ఈ ప్రదర్శనతో ఐసీసీ టి 20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలోనే ఉంటాడని భావించినా, తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి పరిమితమయ్యాడు.
పాకిస్తాన్ ప్లేయర్ రిజ్వాన్ మాత్రం ఇంగ్లాండ్ సిరీస్లో అదరగొట్టాడు. దాంతో మొదటి స్థానం కైవసం చేసుకున్నాడు. మరో వైపు సౌత్ ఆఫ్రికాతో జరిగిన మూడో టీ 20లో పేలవ ప్రదర్శన చేశాడు సూర్యకుమార్. దీంతో రెండో స్థానానికి పడిపోయాడు. భారత్ ఈ మ్యాచ్లో 49 పరుగుల తేడాతో పరాజయం చెందింది.
కాగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 801 పాయింట్లతో మూబో ర్యాంకులో ఉన్నాడు. మరోపక్క దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్క క్రమ్ నాలుగో స్థానంలో ఉండగా, ఇంగ్లం డ్ ప్లేయర్ డేవిడ్ మలన్ ఐదో స్థానానికి చేరుకున్నాడు.
టీమ్ ఇండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ దక్షిణాఫ్రికాతో సిరీస్లో 108 పరుగులతో మెరుగ్గా ఆడాడు. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్లో 3 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంకుకు చేరుకున్నాడు.
దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ కూడా 8 స్థానాలు పైకెక్కి 12వ ర్యాంకులో నిలిచాడు. మూడో టీ 20లో అద్భుత శతకం సాధించిన రిలీ రోసో 23 స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి చేరుకున్నాడు. డేవిడ్ మిల్లర్ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 29వ ర్యాంకులో నిలిచాడు.
More Stories
విదేశీ విద్యార్థులకు కెనడా వారానికి 24 గంటలే వర్క్ పర్మిట్
ఆఫ్ఘన్ షియా మసీదులో కాల్పులు.. ఆరుగురు మృతి
కొవిషీల్డ్తో ప్రమాదకరమైన దుష్ప్రభావాలు