ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5 జీ సేవలు బుధవారం నుండి అందుబాటులోకి వచ్చాయి. దీంతో 5G నెట్వర్క్ లను రూపొందించిన దేశాల ఎంపిక జాబితాలో భారతదేశం చేరింది. అయితే, తొలిసారిగా దసరా పండుగను పురస్కరించుకొని దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో 5 జీ సేవలు ప్రయోగాత్మకంగా అందించేందుకు రిలయన్స్ జియో సిద్ధమైంది. ఈ 5 జీ సేవలను కూడా పరిమిత వినియోగదారులకు మాత్రమే అందిస్తున్నారు.
ముంబై, ఢిల్లీ, కోల్కతా, వారణాసి నగరాల్లోని జియో వినియోగదారులు బుధవారం నుంచి 5జీ సేవలను యాక్సెస్ చేయనున్నట్లు రిలయన్స్ జియో సంస్థ తెలిపింది. అయితే, జియో ప్రతి ఒక్క వినియోగదారుడికి ఈ 5 జీ సేవలు అందుబాటులోకి రావని పేర్కొన్నది. కొందరికే ఈ సేవలు తొలి రోజున అందనున్నాయి.
ఎంపిక చేసిన వినియోగదారులకు ‘జియో వెల్కం ఆఫర్’ అంటూ ఇన్విటేషన్ పంపించారు. ఈ 5 జీ సేవల బీటా పరీక్ష మాత్రమే కానీ వాణిజ్య ప్రయోగం కాదు. అందుకని రాండమ్గా ఎంపికైన వినియోగదారులకు మాత్రమే 5 జీ సేవలు అందుతాయి.
ర్యాండ్మెగా ఎంపికైన వినియోగదారులు ప్రస్తుతం వాడుతున్న హ్యాండ్సెట్, సిమ్ను మార్చాల్సిన అవసరం లేదని సంస్థతెలిపింది. ప్రయోగాత్మకంగా అందిస్తున్న తొలి దశలో 1 జీబీపీఎస్ వేగంతో అన్లిమిటెడ్ 5 జీ డాటాను కస్టమర్లు పొందుతారని రిలయన్స్ జియో ధ్రువీకరించింది.
ఇక రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకారం, దేశంలో నెట్వర్క్ విస్తరించడానికి కనీసం 18 నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ ఈ నెట్వర్క్ని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు
More Stories
చైనాలో ఆర్థిక సవాళ్లు నిజమేనన్న జిన్పింగ్
ఏప్రిల్లో గరిష్ట స్థాయికి చేరిన జీఎస్టీ వసూళ్లు
బాబా రాందేవ్కు సుప్రీంకోర్టు ప్రశంసలు