భద్రతామండలిలో రష్యాపై ఓటింగ్కు భారత్ దూరం

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అమెరికా, ఆల్బేనియా ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది. ఉక్రెయిన్ కు చెందిన నాలుగు భూభాగాలు తమదేశంలో వీలినం అయ్యాయంటూ రష్యా ప్రకటనకు వ్యతిరేకంగా ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. 

భద్రతామండలిలో 15 దేశాలకు గానూ 10 దేశాలు ఈ తీర్మానానికి మద్ధతుగా ఓటెయ్యగా భారత్, చైనా, బ్రెజిల్, గాబన్ దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. అయితే తన అధికారంతో రష్యా ఈ తీర్మానాన్ని వీటో చేసింది. 

ఉక్రెయిన్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై భారత్ తీవ్రంగా కలత చెందింది భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ యూఎన్లో తెలిపారు. మనుషుల ప్రాణాలను పణంగా పెట్టి ఎటువంటి పరిష్కారాలు సాధించలేమని  ఆమె స్పష్టం చేశారు.  హింసను నిలిపివేయడానికి ఇరుపక్షాలు చర్చలు జరపాలని పేర్కొంటూ వివాదాలు, విభేధాలను పరిష్కరించడానికి చర్చలే సమాధానమని తెలిపారు. 

ఒక దేశం మరో దేశం భూభాగాన్ని ఆక్రమించుకోవడం అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటర్రెస్ స్పష్టం చేశారు. నాలుగు భూభాగాలను తమ దేశంలో విలీనం చేసుకుంటూ రష్యా తీసుకున్న నిర్ణయానికి న్యాయపరమైన విలువ ఉండదని పేర్కొన్నారు. అంతర్జాతీయ న్యాయ చట్రంలో దీనిని పరిగణలోకి తీసుకోలేమని చెప్పారు.

ఉక్రెయిన్ భాగాలను కలుపుకోవడానికి రష్యా చేపట్టిన రిఫరెండమ్(ప్రజాభిప్రాయ సేకరణ)ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఖండించడమే కాక ఓటింగ్ నిర్వహించింది. దీనికి భారత్ దూరంగా ఉండిపోయింది. హింసాత్మక కార్యకలాపాలను కూడా రష్యా వెంటనే ఆపేయాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. 

15 దేశాల భద్రతా మండలి ఉక్రెయిన్లో నిర్వహించిన రెఫరెండమ్ ను ఖండించింది. దాని ముసాయిదా తీర్మానాన్ని అమెరికా, అల్బెనియా ప్రవేశపెట్టాయి. భారత్ తో పాటు చైనా, గబన్, బ్రెజిల్ దేశాలు కూడా ఓటింగ్ కు గైర్హాజరు అయ్యాయి. 

కాగా భారత్ అంతర్జాతీయ సముదాయంతో కలిసి పనిచేయగలదని రుచిర కంబోజ్ తెలిపారు. భారత్ దృక్పథం మానవతావాదంతో కూడుకున్నదని కూడా తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని సేకరించి డొనెత్క్స్, లుహాన్స్క్, ఖేర్సాన్, జపోరిఝుయాలను తమదేశంలో విలీనం చేసుకుంటున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.