గాంధీనగర్ లో పెద్దఎత్తున డిఫెన్స్ ఎక్స్పో
గుజరాత్ లోని గాంధీనగర్ లో 2022 అక్టోబర్ 18 నుంచి 22 వరకు డిఫెన్స్ ఎక్స్పో 2022 జరగను
జాతీయ, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో భారత వైమానిక, రక్షణ రంగాలను బలోపేతం చేసి స్వావలంబన సాధించి భారతదేశాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నాలకు అద్దం పట్టే విధంగా డిఫెన్స్ ఎక్స్పో 2022 జరగను
భారతీయ కంపెనీల కోసం మొట్టమొదటి ప్రత్యేకంగా నిర్వహిస్తున్న డిఫెన్స్ ఎక్స్పోగా డిఫెన్స్ ఎక్స్పో 2022 నిలుస్
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు పరిధి నుంచి రక్షణ రంగ సంస్థలుగా ఏర్పడిన ఏడు కొత్త రక్షణ కంపెనీలు మొదటి వార్షికోత్సవం డిఫెన్స్ ఎక్స్పో 2022 లో జరగుతుంది. ఈ ఏడు సంస్థలు తొలిసారిగా డిఫెన్స్ ఎక్స్పో లో పాల్గొంటున్నాయి. అయిదు రోజుల పాటు డిఫెన్స్ ఎక్స్పో 2022 జరుగు
అక్టోబర్ 18-20 వరకు వ్యాపార కార్యక్రమాలు జరుగుతాయి. అక్టోబర్ 21, 22 తేదీల్లో ప్రదర్శనను సందర్శించడానికి ప్రజలను అనుమతిస్తారు. డిఫెన్స్ ఎక్స్పో ప్రదర్శన తొలిసారిగా నాలుగు వేదికల్లో జరగనున్నది. ప్రారంభ కార్యక్రమం, సదస్సులు 2022 మహాత్మా మందిర్ కన్వెన్షన్ లో జరుగుతాయి. హెలిప్యాడ్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రదర్శన, సబర్మతి నది తీరంలో ప్రత్యక్ష ప్రదర్శనలు, పోర్ బందర్ వద్ద ఇండియన్ నేవీ ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌకలను సందర్శించడానికి ప్రజలకు అవకాశం కల్పిస్తారు.
భారతదేశం -ఆఫ్రికా దేశాల మధ్య రెండో దఫా రక్షణ రంగ చర్చలకు డిఫెన్స్ ఎక్స్పో 2022 ఆతిథ్యం ఇస్తుంది. చర్చల్లో ఆఫ్రికా దేశాలకు చెందిన పలువురు రక్షణ మంత్రులు పాల్గొంటారు. హిందూ మహా సముద్ర ప్రాంతం కోసం ప్రత్యేక సదస్సు నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి.
‘పాత్ టు ప్రైడ్’ పేరుతో ఏర్పాటయ్యే ఇండియా పెవిలియన్ స్వదేశీ రక్షణ ఉత్పత్తుల పరిపక్వత, స్టార్టప్లు, రక్
More Stories
సీఎం జగన్పై రాయి దాడి కేసులో సతీష్ అరెస్ట్
ఐరాస సంస్కరణలకు అమెరికా మద్దతు
రూ 100 కోట్ల శిల్పాశెట్టి భర్త ఆస్తుల ఈడీ జప్తు