తనను హత్య చేసేందుకు భారీ కుట్ర జరుగుతుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో నిజాయితీగా పనిచేస్తున్న పలువురు అధికారులను యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మీనారాయణ ఈ ఆరోపణలు చేశారు.
ప్రస్తుతం ప్రజాసేవకన్నా వ్యక్తిగత స్వార్థం.. అవినీతి పెరిగిందని , నిజాయతీగా ఉండాలని నిర్ణయించుకున్న వారికి కష్టాలు తప్పవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని ఎరుపు ఇంకుతో బెదిరింపు రాసిన లేఖలు వచ్చిన సందర్భాలున్నాయి అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
పెద్ద తిమింగలాలు వలలో పడవని చెబుతూ వాటిపై దృష్టిసారించి రాజకీయ అవినీతిని రూపుమాపేందుకు కృషి జరగాలని సూచించారు. చిన్నప్పుడు ట్యూషన్కు వెళ్లాలంటే సిగ్గుపడేవాళ్లమని, చక్కగా టీచర్లు పాఠాలు చెబుతున్నా ట్యూషన్ అంటే సిగ్గుగా ఉండేదని తెలిపారు. కానీ, ఇప్పుడు మాత్రం ఓపెన్గా వెళుతున్నారని పేర్కొన్నారు.అవినీతిని ఎలా తగ్గించాలన్న దానిపై ఆలోచించాలని.. ఆదాయ పన్నుశాఖలో వ్యక్తులు కలుసుకునే అవసరం లేకుండా ఆన్లైన్ విధానం తెచ్చారని గుర్తు చేశారు. ఇలా సాంకేతికత అవినీతిని తగ్గించే లక్ష్యంతో ఉండాలి తెలిపారు. ఒకప్పుడు అవినీతిపరుడు భయంగా తిరిగేవాడని.. ఇప్పుడు నిజాయితీ పరుడు భయంతో తిరగాల్సిన పరిస్థితి సమాజంలో ఉంది అన్నారు. ప్రజాసేవ కన్నా వ్యక్తిగత స్వార్థం ఏ సమాజంలో ప్రాధాన్యత పొందుతుందో ఆ సమాజం అవనితి బరువుతో నాశనం అవుతుందన్నారు.
నిజాయితీతో ఉంటే ఆ కష్టాలు తాత్కాలికంగా ఉంటాయని చెబుతూ గెలుపు సత్యానిదే అని స్పష్టం చేశారు. ఎప్పుడూ అధైర్యపడకండి.. అవినీతిని ఎలా తగ్గించాలని ఆలోచించాలని సూచించారు.
More Stories
ఏపీని అన్ని విధాలా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్’
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్గా విశ్వజిత్
వైసీపీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది