కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం రూ. 3,000 కోట్లతో చేపట్టనున్న ఎనిమిది జాతీయ రహదారుల ప్రాజెక్టులకు రాజమహేంద్రవరం శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత, కాకినాడ ప్రత్యేక ఆర్థిక జోన్ (సెజ్), సెజ్ పోర్ట్, ఫిషింగ్ హార్బర్, కాకినాడ యాంకరేజ్ పోర్ట్లకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అనుసంధానం ఈ ప్రాజెక్టు ద్వారా కలుగుతాయని మంత్రి తెలిపారు.
ఇది బియ్యం, సముద్ర ఆహారాలు, ఆయిల్ మీల్స్, ఐరన్-ఎగుమతులను సులభతరం చేస్తుందన్నారు. కాకినాడ పోర్టు ద్వారా ఖనిజం, జీవ ఇంధనం, గ్రానైట్ మొదలైనవి ఎగుమతులకు సులభమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కైకరం, మోరంపూడి, ఉండరాజవరం, తే
అవి పూర్తయిన తర్వాత నామవరం, శాటిలైట్ సిటీ, మండపేట, రామచంద్రపురం, ఉం
వాకలపూడి-ఉప్పాడ-అన్నవరం & సా
ఇది అరకు & లంబసింగి వంటి గిరిజన ప్రాంతాలకు మరియు అరకు లోయ & బొర్రా గుహలు వంటి ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలకు రహదారి అనుసంధానాన్ని కూడా అందిస్తుంది. ఇది కాకినాడ- అల్లూరి సీతారామ జిల్లాల ద్వారా సురక్షితమైన, మెరుగైన, వేగవంతమైన రాష్ట్రాంతర అనుసంధానాన్ని కూడా అందిస్తుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం నిబద్దత కలిగి ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ రోజు ప్రారంభించిన జాతీయ రహదారుల ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులు హాజరయ్యారు.
More Stories
బీజేపీ గెలుపు మన దేశానికి అవసరం
ఏపీలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సీఆర్పీఎఫ్ బలగాలు
7, 8 తేదీల్లో ప్రధాని మోదీ ఏపీలో పర్యటన