సిఖ్కు ప్రతినిధి వర్గంతో ప్రధాని మోదీ సమావేశం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన నివాసం 7 లోక్ కల్యాణ్ మార్గ్ లో ఓ సిఖ్కు ప్రతినిధి వర్గంతో సోమవారం సమావేశమయ్యారు. ప్రధాన మంత్రి జన్మదినం సందర్భంగా దిల్లీ లోని గురుద్వారా శ్రీ బాలా సాహిబ్ జీ ఒక ‘అఖండ్ పాఠ్’ను నిర్వహించింది. సెప్టెంబర్ 15న మొదలైన ‘అఖండ్ పాఠ్’ ప్రధాన మంత్రి పుట్టిన రోజైన  సెప్టెంబర్ 17న ముగిసింది.

సిఖ్కు ప్రతినిధి వర్గం ప్రధాన మంత్రిని కలుసుకొని, గురుద్వారా నుండి ప్రసాదాన్ని ఇవ్వడంతో పాటు ఆశీర్వాదాలను కూడా అందజేసింది. ఈ సందర్భంగా సిఖ్కు ప్రతినిధి వర్గం ప్రధాన మంత్రికి ఒక పగ్ డీని అలంకరించడంతో పాటుగా ఒక శిరోపాను కూడా ప్రదానం చేసి మరీ సత్కరించింది. ప్రధాన మంత్రికి దీర్ఘ జీవనం కోసం, చక్కని స్వస్థత కోసం ఒక అర్ దాస్ (ప్రార్థన)ను కూడా జరిపింది.

సిఖ్కు సముదాయం  గౌరవం కోసం, సంక్షేమం కోసం పథ నిర్దేశక కార్యక్రమాలను చేబడుతున్నందుకు ప్రధాన మంత్రికి ప్రతినిధి వర్గం ధన్యవాదాలను కూడా తెలిపింది. డిసెంబర్ 26వ తేదీ ని ‘‘వీర్ బాల్ దివస్’’గా ప్రకటించడం, కర్ తార్ పుర్ సాహిబ్ కారిడోర్ ను పున:ప్రారంభించడం, గురుద్వారా లు నడిపే లంగర్ లకు జిఎస్ టి ని తొలగించడం, గురు గ్రంథ్ సాహిబ్  ప్రతులు భారతదేశం నుండి అఫ్ గానిస్తాన్ కు చేరేటట్టు చూడడం వంటి ప్రధాన మంత్రి చేపట్టిన అనేక చర్యలను గురించి వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

సిఖ్కు ప్రతినిధి వర్గంలో అఖిల భారత కేంద్రీయ గురు సింహ్ సభ అధ్యక్షుడు తార్ వీందర్ సింహ్ మార్వా, అఖిల భారత కేంద్రీయ గురు సింహ్ సభ వర్కింగ్ ప్రెసిడెంటు వీర్ సింహ్, కేంద్రీయ గురు సింహ్ సభ దిల్లీ అధిపతి నవీన్ సింహ్ భండారి, గురుద్వారా సింహ్ సభ అధ్యక్షుడు హర్ బన్స్ సింహ్, గురుద్వారా సింహ్ సభ  హెడ్ గ్రంథి  రాజీందర్ సింహలు ఉన్నారు.