ఐసీఏఐ ఆఫీస్ బేరర్లు తమ వృత్తిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చేస్తున్న కృషికి మంత్రి అభినందనలు తెలిపారు. రాబోయే 25 సంవత్సరాలు భారతదేశం ఒక శక్తిగా ఎదగడానికి, భౌగోళిక రాజకీయ రంగంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సాధించడానికి చాలా కీలకమైన సమయం అని ఆయన తెలిపారు. భారతదేశం చేస్తున్న ఈ ప్రయాణంలో ఐసిఏఐ కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
118 సంవత్సరాలలో తొలిసారిగా 2022 నవంబర్లో ముంబైలో జరగనున్న 21వ ప్రపంచ అకౌంటెంట్స్ కాంగ్రెస్ను ప్రస్తావిస్తూ.. భారతదేశం జీ20 అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు ఇది జరగాలని నిర్ణయించుకున్నట్లు గోయల్ చెప్పారు. దేశాల మధ్య భారతదేశానికి పెరుగుతున్న ఔచిత్యానికి ఇది గుర్తింపు అని ఆయన పేర్కొన్నారు.
కల్లోల ప్రపంచంలో భారతదేశం సుస్థిర ద్వీపమని తెలిపిన మంత్రి, నేడు వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం ఒకటని చెప్పారు. ద్రవ్యోల్బణంపై భారతదేశ దృష్టిని పేర్కొంటూ 2014 నుండి, ద్రవ్యోల్బణం ఆర్బీఐ ప్రాథమిక దృష్టి అని ప్రభుత్వం నిర్ధారిస్తున్నదని, 2014 నుండి, భారతదేశం సగటున 4.5% ద్రవ్యోల్బణాన్ని చూసిందని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇది మనం ఏ 8 సంవత్సరాలలో చూసినా కనిష్ట స్థాయి అని మంత్రి తెలిపారు.
నేడు ప్రపంచంలో అనిశ్చిత ద్రవ్యోల్బణం దృష్ట్యా భారతదేశం అత్యంత అనుకూలమైన పెట్టుబడి గమ్యస్థానాలలో ఒకటి అని పేర్కొంటూ నేడు ప్రపంచానికి ప్రాధాన్యత కలిగిన భాగస్వామి అని మంత్రి గోయల్ స్పష్టం చేశారు. ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా భారత్తో తమ భాగస్వామ్యాన్ని, వాణిజ్యాన్ని విస్తరించడానికి ప్రపంచ నాయకులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.
More Stories
అమేథిలో రాహుల్, రాయ్బరేలీలో ప్రియాంక పోటీ?
ఏపీని అన్ని విధాలా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్’
మోదీ, రాహుల్ ప్రసంగాలపై ఈసీ నోటీసులు