రేజర్‌పే, పేటీఎం, క్యాష్‌ఫ్రీ కార్యాలయాలపై ఈడి దాడులు

 చైనా వ్యక్తులు నియంత్రణలో ఇన్ స్టాంట్ స్మార్ట్-ఫోన్ లోన్లు ఇస్తున్నారన్న ఫిర్యాదుపై బెంగళూరులోని ఆన్ లైన్  పేమెంట్ గేట్ వేస్ అయిన రేజర్ పే, పేటిఎం, క్యాష్ ఫ్రీ కార్యాలయాలపై  ఎన్ ఫోర్స్ మెంట్  డైరక్టరేట్(ఈడి) శనివారం దాడులు నిర్వహించింది. 

కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని ఆరు ప్రాంగణాల్లో శుక్రవారం సోదాలు ప్రారంభించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని ఈడి తెలిపింది. ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ ఈ దాడుల్లో “చైనీస్ వ్యక్తుల నియంత్రణలో ఉన్న ఈ సంస్థల వ్యాపారి ఐడిలు ,  బ్యాంక్ ఖాతాలలో ఉంచిన రూ. 17 కోట్ల విలువైన నిధులను స్వాధీనం చేసుకున్నట్లు’’ తెలిపింది.

ఈ సంస్థల కార్యనిర్వహణ విధానం ఏమిటంటే, వారు భారతీయుల నకిలీ పత్రాలను ఉపయోగించి,  వారిని డమ్మీ డైరెక్టర్లుగా మార్చడం ద్వారా “నేరపు ఆదాయాల” తరానికి దోహదం చేస్తున్నారని ఆరోపించింది.  “రేజర్ పే ప్రయివేట్ లిమిటెడ్, క్యాష్‌ఫ్రీ పేమెంట్స్, పేటీఎం  పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్,  చైనీస్ వ్యక్తులచే నియంత్రించబడే/నిర్వహించబడే సంస్థలు సెర్చ్ ఆపరేషన్‌లో కవర్ చేయబడ్డాయి” అని ఈడి తెలిపింది.

దర్యాప్తులో ఉన్న సంస్థలు వివిధ వ్యాపారి ఐడిలు/పేమెంట్ గేట్‌వేలు/బ్యాంకుల ఖాతాల ద్వారా నేరాల ద్వారా ఆదాయాన్ని పొందుతున్నాయి,  ఎంసిఏ(కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ) వెబ్‌సైట్/రెజిస్టర్ఢ్  చిరునామాల అడ్రసులకు కూడా సరిపోని బూటకపు అడ్రసులు అవి. బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నమోదయిన 18 ఎఫ్ఐఆర్ ల మీద  మనీలాండరింగ్ కేసు చేపట్టామని ఈడి పేర్కొంది. 

అక్రమ లావాదేవీలు, వేధింపులకు పాల్పడిన అనేక మంది ఈ కేసులో ఉన్నారని కూడా తెలిపింది. బాధితులంతా ఫోన్ యాప్స్ ద్వారా డబ్బు తీసుకుని వేధింపులకు గురయినవారేనని తెలిపింది.

లోన్ యాప్స్‌కు ఆర్‌బిఐ కొత్త రూల్స్

ఇలా ఉండగా, మొబైల్ యాప్ నుంచి రుణాల పేరుతో జరుగుతున్న మోసాలను నివారించేందుకు ఆర్బీఐ మార్గదర్శకాలను విడుదల చేసింది. బ్యాంకులతో సహా లోన్ యాప్ నిర్వాహకులు కూడా కస్టమర్ల డేటాను స్టోర్ చేయడం, దుర్వినియోగం చేయకూడదని ఆర్బీఐ నిర్దేశించింది. 
 
నూతన మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని, నవంబర్ 30లోగా రుణసంస్థలన్నీ అమలుపరచాలిందిగా ఆర్బీఐ శుక్రవారం ప్రకటన జారీ చేసింది.నూతన మార్గదర్శకాల ప్రకారం డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫారమ్‌లు నేరుగా కస్టమర్ బ్యాంక్ ఖాతాలోకి రుణమొత్తాన్ని క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం థర్డ్‌పార్టీ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించకూడదు. 
 
లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఏదైనా పొరపాటు జరిగినా సదరు ఎన్‌బిఎఫ్‌సి కంపెనీ తన బాధ్యతగా పరిష్కరించాలి. వార్షికశాతం రేటు అన్ని రకాల నిధుల ఖర్చు, క్రెడిట్ ఖర్చు, నిర్వహణ వ్యయం, ప్రాసెసింగ్ రుసుము, ధ్రువీకరణ ఛార్జీలు, నిర్వహణ ఛార్జీలను కలిగి ఉంటుంది.