రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్‌

రూ. 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) షాక్‌ ఇచ్చింది. సుకేశ్‌ చంద్రశేఖర్‌ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ.200 కోట్ల మనీ లాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌ని నిందితురాలిగా ఈడీ పరిగణించింది.

 కోర్టులో దాఖలు చేసిన అనుబంధ చార్జ్షీట్లో ఆమె పేరును చేర్చింది. దోపిడి ద్వారా వచ్చిన డబ్బు ద్వారా ఆమె లబ్ది పొందినట్లు ఈడీ వెల్లడించింది. రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లను రూ.200 కోట్లకు మోసం చేసిన కేసులో సుకేశ్‌ చంద్రశేఖర్‌ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

సుకేష్ చంద్రశేఖర్ దోపిడి చేసిన సొమ్ములో నుంచి రూ 5.71 కోట్ల విలువైన వివిధ బహుమతులను జాక్వెలిన్కు ఇచ్చినట్లు ఈడీ చార్జ్షీట్లో పేర్కొంది. ఈ బహుమతుల్లో రూ 52 లక్షల విలువైన గుర్రం, రూ 9 లక్షల విలువైన పర్షియన్ పిల్లి ఉన్నట్లు ఈడీ తెలిపింది.  దోపిడి ద్వారా వచ్చిన సొమ్ము నుంచి బహుమతులు ఇస్తున్నట్లు ఆమెకు తెలుసని ఈడీ ఆరోపించింది. ఇప్పటికే జాక్వెలిన్ కు చెందినరూ  7 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. ఈ కేసులో మొత్తం 8మందిని ఈడీ అరెస్ట్ చేసింది.

కాగా రాన్బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి సుకేష్ ఏకంగా రూ 200 కోట్లు వసూల్ చేశాడు. అయితే బెయిల్ విషయం దాటవేస్తుండడంతో శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

2021లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయగా..జైల్లో ఉండి కూడా అతడు నేరాలను కొనసాగించినట్లు ఈడీ గుర్తించింది.  మరోవంక, చంద్రశేఖర్‌ కు  జాక్వెలిన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ విచారణలో తేలింది. రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్‌ సింగ్‌, శివిందర్‌ సింగ్‌కు బెయిల్‌ ఇప్పిస్తామని నమ్మించి వారి భార్యల నుంచి రూ. 200 కోట్లు వసూల్‌ చేశాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌. ఆ తర్వాత బెయిల్‌ విషయాన్ని దాటవేశాడు.

దీంతో శివిందర్‌ సింగ్‌ భార్య అదితి సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గతేడాదిలో ఢిల్లీ పోలీసులు సుకేశ్‌ అరెస్ట్‌ చేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన ఈడీ.. ఇప్పటికే 8 మందిని అరెస్ట్‌ చేసింది.