ఆయన మాట్లాడుతూ. కొన్నేళ్ల క్రితం వరకూ ఆర్ఎస్ఎస్పై తనకున్న భావన వేరని, దానిపై చిత్రాన్ని తీసేందుకు కథను అందించాల్సిందిగా కోరడంతో నాగ్పూర్ వెళ్లి వాస్తవాలను తెలుసుకున్నాక తన అభిప్రాయం తప్పని తెలుసుకున్నానని వివరించారు.
‘‘నేను రాసే కథలు తీయటి అబద్ధాలు. విన్న కథలన్నీ నిజం కావు. కొన్ని కథలు మత్రం నిజమవుతాయి’’ అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. నాలుగేళ్ల కిత్రం ఆర్ఎ్సఎస్ మీద కథ రాయమని అడిగినప్పుడు అందుకోసం తాను నాగపూర్ వెళ్లాననాన్నరు. అప్పటి వరకు స్వయం సేవక్ గురించి పెద్దగా తెలియదని, గాంధీజీని స్వయం సేవక్ చంపిందన్న భావనలో ఉన్నానని చెప్పారు.
అయితే, స్వయం సేవక్ సంఘ్ లేకపోతే కశ్మీర్ ఉండేది కాదని, ఎప్పుడో పాకిస్థాన్ వశమయ్యేదని స్పష్టం చేశారు. స్వయం సేవక్ గురించి తెలుసుకుని పరిపూర్ణమైన పశ్చాత్తాపం చెందానని పేర్కొన్నారు. స్వయం సేవక్పై కథ రాసి మోహన్ భగవత్కు చూపిస్తే ఆయన ఎంతో పొంగిపోయారని చెప్పారు.
రామ్మాధవ్ మాట్లాడుతూ బ్రిటిష్ వాళ్లను దేశం నుంచి పంపడం ఒక్కటే స్వాతంత్రోద్యమం కాదని స్పష్టం చేశారు. బ్రిటన్ కంటే భారతదేశ ప్రజాస్వామ్యం గొప్పదని నిరూపించుకోగలిగామని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నవారు ఎక్కడ కావాలంటే అక్కడ రాజధానులు ఏర్పాటు చేసుకోవడం ప్రజాస్వామ్యం కాదని జగన్ ప్రభుత్వంపై పరోక్షంగా మండిపడ్డారు.
More Stories
మోదీ పథకాలకు స్టిక్కర్ లతో జగన్ మోసం
రమణ దీక్షితులుకు నోటీసు ఇచ్చి వివరణ తీసుకోండి
విశాఖ స్టీల్ మూతపడే దుస్థితి శోచనీయం