చేతగానితనంతోనే టీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడ్డరని బి
మునుగోడు భయంతోనే దాడులు
మునుగోడు ఉప ఎన్నిక భయంతోనే టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ నేతలపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు విసరడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. పాదయాత్ర చేసుకునే స్వాతంత్ర్యం లేదా అని ప్రశ్నించారు.
దాడి వెనుక ఎర్రబెల్లి దయాకర్ రావు హస్తం ఉందని రాణి రుద్రమ ఆరోపించారు. తమపై దాడులు చేస్తే దయాకర్ రావు పాలకుర్తిలో తిరగలేరని ఆమె హెచ్చరించారు. ప్రభుత్వం సంజయ్కు ఎందుకు రక్షణ కల్పించడం లేదని ప్రశ్నించిన ఆమె శాంతి భద్రతలకు విఘాతం కలిగితే రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ బాధ్యత వహించాల్సి ఉంటదని స్పష్టం చేశారు.
ఎన్ని కుట్రలు చేసినా ప్రజా సంగ్రామ యాత్ర తెలంగాణలోని ప్రతి గడపను తాకుతుందని, ప్రతి సమస్యను సంజయ్ తెలుసుకుంటారని ఆమె తేల్చి చెప్పా. ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్తామన్న రాణి రుద్రమ.. టీఆర్ఎస్ నేతలకు మునుగోడు ఉప ఎన్నిక భయం పట్టుకుందని ఆమె ఎద్దేవా చేశారు.
More Stories
పదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ 10 లక్షల కోట్లు
మేడిగడ్డ పునరుద్ధరణకు ముందుకొచ్చిన ఎల్అండ్టీ
ఆకట్టుకుంటున్న జై హనుమాన్ పోస్టర్