శ్రీనివాస్ గౌడ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి

టిఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనీ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ డిమాండ్ చేసారు. వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీనివాస్ గౌడ్ ర్యాలీ లో పాల్గొన్నారు. కాగా ర్యాలీలో జనం మధ్య ఆయన తుపాకీతో కాల్పులు జరపడం ఇప్పుడు వివాదంలోకి నెట్టాయి. 

పోలీసుల చేతుల్లోని తుపాకీని తీసుకుని ఆయన గాల్లోకి కాల్పులు జరిపిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవ్వడం.. మరోవైపు అధికారులు సైతం ఆయన్ని అడ్డుకోలేదనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.
 
 పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ నుంచి తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన ఆయనపై ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని రఘునందన్   ప్రశ్నించారు. బాధ్యత కలిగిన మంత్రి పీఎస్వో దగ్గర గన్ తీసుకుని కాల్చటం చట్ట విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. గన్ సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్ కు ఎందుకు పంపలేదన్న రఘునందన్.. శ్రీనివాస్ గౌడ్ పై ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని స్పష్టం చేశారు.
విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే శ్రీనివాస్ గౌడ్ను మంతిర్ప దవి నుంచి తప్పించాలని, మంత్రి మీద నమ్మకం ఉంటే రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని బిజెపి నేత  డిమాండ్ చేశారు. అలాగే డీజీపీ తీరుపైనా రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  రిటైర్ అయిన తర్వాత వచ్చే ప్రభుత్వ సలహాదారు పదవి కోసం ఆశపడి ఆయన మౌనంగా ఉండటం సరికాదని హితవు పలికారు. ఒకవేళ డీజీపీ మంత్రిపై చర్యలు తీసుకోకుంటే తానే హైకోర్టులో పిల్ వేస్తానని రఘునందన్ రావు స్పష్టం చేశారు.
 
ప్రైవేట్ వ్యక్తికి వెపన్ తుపాకీ ఇచ్చి కాల్చమనే అధికారం ఎస్పీ సహా ఎవరకీ లేదని, ఒకవేళ ఒకవేళ ఎస్పీ గన్ ఇచ్చుంటే ఆయనను కూడా నిందితునిగా చేర్చాలని డిమాండ్ చేశారు. గన్లో రబ్బరు బుల్లెట్లు ఉన్నాయన్న వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టారు. గన్మెన్ల తుపాకుల్లో రబ్బరు బుల్లెట్లు ఉంటాయా అని ప్రశ్నించారు. 
లైసెన్స్‌డ్‌ గుండాలుగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు
 
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు లైసెన్స్‌డ్‌ గుండాలు అయిపోయారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. మంత్రులు గాల్లోకి కాల్పులు జరుపుతుంటే రజాకార్ల పాలన మళ్లీ వచ్చిందా అనిపిస్తుందని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈడీని వాడుకోవాలని చూస్తే తెలంగాణలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగలడని స్పష్టం చేశారు.