
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో నిలిపివేసిన 12026/12025 సికింద్రాబాద్ – పూణే — సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ రైలును బుధవారం 10 ఆగస్టు నుంచి రెండు వైపులా పునరుద్ధరించారు. దాంతో పాటు రైలులో కొత్తగా చేర్చిన విస్టాడోమ్ కోచ్ కు ప్రయాణీకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్ కోచ్ తో నడిచే మొట్టమొదటి రైలు ఇదే కావడం గమనార్హం.
విస్టాడోమ్ కోచ్ ప్రవేశపెట్టిన మొదటి కొద్దీ రోజుల్లో రైలులో ప్రయాణీకుల సగటు 63% ఉంది. లింక్ హఫ్మాన్ బుష్ (ఎల్ హెచ్ బి) కోచ్ లతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ రైలుకు విస్టాడోమ్ కోచ్ ను చేర్చడం అదనపు ఆకర్షణగా మారింది. పెద్ద పెద్ద గాజు కిటికీలుండె ఈ కోచ్ పై కప్పు కూడా గాజుతో చేసింది కావడంతో ఈ కోచ్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణీకులు సికింద్రాబాద్ – పూణే – సికింద్రాబాద్ మార్గంలో తమ చుట్టూ ఉన్న పరిసరాలను కొండలను, లోయలను చూస్తూ వెళ్లడం ఆశ్చర్యజనకంగా ఉంటుంది.
పెద్ద పెద్ద గాజు కిటికీలు ప్రయాణీకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. సికింద్రాబాద్ – పూణే – సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ ప్రయాణీకులు అడవుల మీదుగా వెళ్తున్నప్పుడు ప్రకృతి అందాలను చూసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వికారాబాద్ దగ్గర ఉన్న అనంతగిరి హిల్స్ , ఉజ్ని వృష్టజలాలను మరియు బిగ్వాన్ దగ్గరి డ్యామును చూడవచ్చు. ఆ ప్రాంతం దేశీయ, వలస పక్షులకు నెలవు.
గాజు పైకప్పు మాత్రమే కాక విస్టాడోమ్ కోచ్ లకు మరెన్నో పెద్ద పెద్ద గాజు కిటికీలు, ఎల్ ఈ డి లైట్లు, వెనక్కి జారిగీల పడే, చుట్టూ తిరిగే పుష్ బ్యాక్, రొటేటల్ సీట్లు, విద్యుత్ తో తెరుచుకునే కంపార్ట్మెంట్ తలుపులు పక్కకు జరిగే తలుపుల వంటి అదనపు అంశాలు ఈ కోచ్ ప్రత్యేకతలు. ప్రయాణీకులు తాము కూర్చున్న చోటునుంచి కదలకుండా చుట్టూ ఉన్న పరిసరాలను చూడవచ్చు. గుండ్రంగా తిరిగే సీట్లకు తోడుగా పరిశీలన జరిపేందుకు ఒక లాంజ్ కూడా ఈ కోచ్ లో ఉంది.
రైలు నెంబర్ 12026 సికింద్రాబాద్ = పూణే శతాబ్ది ఎక్సప్రెస్ సికింద్రాబాద్ లో మధ్యాన్నం 14.45 గంటలకు బయలు దేరి (మంగళవారం మినహా) పూణేకు అదేరోజు రాత్రి రాత్రి 23.10 గంటలకు (మంగళవారం మినహా) చేరుతుంది. అదేవిధంగా 12025 పూణే- సికింద్రాబాద్ శతాబ్ది ఎక్సప్రెస్ పూణేలో ఉదయం 6.00 గంటలకు బయలుదేరి (మంగళవారం మినహా) సికింద్రాబాదుకు అదే రోజు మధ్యాన్నం 14.20 గంటలకు చేరుతుంది.
ప్రయాణ మార్గంలో ఈ రైళ్లు రెండువైపులా బేగంపేట, వికారాబాద్, తాండూరు, వాడి, కలబుర్గి, సోలాపూర్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైలులో ఒక విస్టాడోమ్ కోచ్, రెండు ఎగ్జిక్యూటివ్ తరగతి కోచ్ లు, తొమ్మిది ఏ సి చైర్ కార్ కోచ్ లు ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి పూణే కు విస్టాడోమ్ కోచ్ లో ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ. 2110/- చార్జి చేస్తారు.
ఎగ్జిక్యూటివ్ తరగతి కోచ్ లో ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ.1935/- చార్జి తీసుకుంటారు. క్యాటరింగ్ సౌకర్యం కావాలంటే బుకింగ్ సమయంలోనే ప్రతి ఒక్కరు అదనంగా రూ. 385/- చెల్లించవలసి ఉంటుంది. ఏ సి చెయిర్ కార్ లో ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ.905/- తో మొదలై ప్రయాణ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ పెరిగే డైనమిక్ ఫేర్ పద్ధతిలో ఛార్జ్ తీసుకుంటారు. క్యాటరింగ్ సౌకర్యం కావాలంటే బుకింగ్ సమయంలోనే ప్రతి ఒక్కరు అదనంగా రూ. 275/- చెల్లించవలసి ఉంటుంది.
More Stories
`సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా ఆర్ఎస్ఎస్ అన్ని అంశాల స్పృశి
బిజెపిపై విషం కక్కడమే వారి అజెండా!
నియోజకవర్గాల పునర్విభజనను 25 ఏళ్లపాటు వాయిదా