సమస్యల పరిష్కారం కోసమే మహిళా దర్బార్

మహిళల సమస్యల పరిష్కారం కోసమే మహిళా దర్బార్ నిర్వహిస్తున్నానని గవర్నర్ డా. తమిళిసై  సౌందరరాజన్ తెలిపారు.  సోమవారం రాజ్ భవన్‌లో నిర్వహించిన రెండో ‘మహిళా దర్బార్‌’లో ఆమెమాట్లాడుతూ ఎవరితోనూ విబేధించి, ఎవరికీ వ్యతిరేకంగా ఈ కార్యక్రమం నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని మహిళలు వినతి పత్రాలతో వస్తున్నారని చెప్పారు. 
 
కాగా, ఈ పర్యాయం మహిళా దర్బార్ లో జాతీయ మహిళా కమిషన్  చైర్‌పర్సన్ రేఖ శర్మ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యలుంటే తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయాలని, వారు స్పందించకపోతే రాష్ట్ర మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.  అక్కడ కూడా పరిష్కారం కాకపొతే జాతీయ మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేయాలని వివరించారు. 
 
తెలంగాణాలో మహిళలకు సంబంధించి ఎన్నో అపరిష్కృత సమస్యలు ఉన్నాయని చెబుతూ ఆన్లైన్ లో తమ పోర్టల్ అందుబాటులో ఉందని, దానిలో ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. గవర్నర్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుండడం గొప్ప విషయమని రేఖ శర్మ కొనియాడారు.
కాగా, గత నెలలో నిర్వహించిన మొదటి మహిళా దర్భార్ లో 400 మంది మహిళలు తమ సమస్యలను విన్నవించుకున్నట్లు గవర్నర్ చెప్పారు. వారితో రాజ్ భవన్ అధికారులు వ్యక్తిగతంగా మాట్లాడి, వారి సమస్యలను సవివరంగా తెలుసుకొని, వాటి పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె వివరించారు.
 
మహిళా దర్బార్ కు వచ్చిన వినతులను పరిష్కరించేందుకు గవర్నర్ తమిళసై తన పరిధిలో కృషి చేస్తున్నారు. ముందుగా సామాజిక  కిందఆకూ సంబంధించిన ఉన్న 40 మంది సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించాయిరు. ఇందులో భాగంగానే  వారిని రాజ్ భవన్ కు పిలిపించారు. వీరికి నయయ సలహాలు, కౌన్సిలింగ్ ఇచ్చేందుకు జాతీయ మహిళ కమిషన్ చైర్మన్ రేఖా శర్మ రాజ్ భవన్ కు వచ్చారని గవర్నర్ తెలిపారు. 
 
మహిళ దర్బార్ లో ముగ్గురికి గవర్నర్ ఆర్థిక సాయం చేశారు. కవాడిగూడకు చెందిన జ్యోతికి రూ 25 వేలు, మాల్కాజ్ గిరికి చెందిన ఉమారాణికి రూ 25 వేలు, ఆత్మకూరుకు చెందిన కుమారికి రూ  25 వేల ఆర్థిక సాయం అందించారు.
రేఖాశర్మ దేశంలో ఉన్న మహిళలకు అండగా నిలిచే స్థానంలో ఉన్నారని గవర్నర్ చెప్పారు. మహిళలు తమకున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్తే సంబంధిత శాఖల అధికారులను అదేశిస్తారని ఆమె తెలిపారు. హైదరాబాద్ లీగల్ సెల్ అథారిటీ కూడా మహిళల సమస్యల పరిష్కారం కోసం ముందుకొచ్చిందని పేర్కొన్నారు.
జూన్ 10న మొదటిసారి గవర్నర్ తమిళిసై మహిళా దర్బార్ ఏర్పాటు చేశారు. మహిళల ఆవేదనను, వారి కష్టాలను తెలుసుకునేందుకు మహిళా దర్బార్ నిర్వహిస్తున్నట్లు గతంలోనే తెలిపారు. మహిళా దర్బార్ కు వందలాదిగా వినతులు వచ్చాయి. ఎక్కువగా భూసమస్యలు.. మహిళలు, బాలికలపై వేధింపులు, అత్యాచారాలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ బదిలీలు.. వంటి అనేక సమస్యలను మహిళలు గవర్నర్ ముందు విన్నవించారు. వారిలో కొందరిని గవర్నర్ రాజ్ భవన్ కు పిలిపించారు.