ముఖ్యమంత్రి కేసీఆర్పై విశ్వహిందూ పరిషద్, బజరంగ్ దళ్ నేతలు సుల్తాన్ బజార్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దేవి దేవతలను కించపరుస్తూ సీఎం కేసీఆర్ మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. కేసీఆర్ పై వెంటనే కేసు నమోదు చేయాలని భజరంగ్ దళ్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్ డిమాండ్ చేశారు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఇటీవల జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో ఉన్న ప్రముఖ దేవతలను కీర్తించారని, దీనిని రాజకీయంగా తప్పు పడుతూ జులై 10న నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో సీఎం కేసీఆర్ హిందూ దేవతలను కించపరిచేలా వ్యాఖ్యానించారని వీహెచ్పీ పేర్కొంది.
జోగులాంబ అమ్మవారిని కించపరిచే విధంగా చేసిన వాఖ్యలను ఖండిస్తూ, హిందు దేవతపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, శక్తి పీఠం జోగులాంబ అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే హిందువులు సహించరని వారు స్పష్టం చేశారు. రాజకీయాలు చేసుకోండి.. హిందు దేవతలను కించపరిస్తే సహించమని హెచ్చరించారు.
గతంలో హిందుగాళ్ళు, బొందు గాళ్ళు అంటూ హిందువులను కించపరిచారని చెబుతూ కేసీఆర్ పై అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. హిందూ దైవాన్ని కించపరిచిన కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని హైకోర్టు ను ఆశ్రయిస్తామని పండరీనాథ్ తెలిపారు.
More Stories
మొట్టమొదటిసారి ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు తీసేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే
హైదరాబాద్లో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీవర్షం
సికింద్రాబాద్లో పలు విభాగాల్లో అగ్నివీర్ ఎంపికలు