సినిమాగా వాజ్ పేయి జీవిత చ‌రిత్ర‌

ఈ మ‌ధ్య‌కాలంలో బ‌యోపిక్ ల‌కుఆద‌ర‌ణ పెరుగుతోంది. వాస్తవ గాధలను రీల్ స్టోరీలుగా తెర‌కెక్కించి విజయం సాధిస్తున్నారు ప‌లువురు ద‌ర్శ‌కులు. ముంబై ఉగ్రదాడి నేపథ్యంలో నిర్మించిన మేజర్ చిత్రం ఘన విజయం సాధించిన తర్వాత పలువురు వీటివైపు దృష్టి సారిస్తున్నారు.  కాగా ఇప్పుడో రాజ‌కీయ నేత జీవిత చ‌రిత్ర తెర‌కెక్క‌నుంది. ఆయ‌నే వాజ్ పేయి.
 
వాజ్‌పేయి ఆర్‌ఎస్‌ఎస్‌లో జీవనం ప్రారంభించి భారతీయ జనసంఘ్ నేతగా, ఆ తర్వాత బిజెపి వ్యవస్థాపక అధ్యక్షునిగా, ప్రధాన మంత్రిగా దేశ రాజకీయాలలో కిర్యశీల పాత్ర పోషించారు.  సుదీర్ఘకాలం ఎంపీగా వ్యవహరించారు. ఏడుసార్లు ఎంపీగా, రెండేళ్లు మంత్రిగా సేవలందించారు. 1996 నుంచి 2004 వరకు భారత ప్రధానిగా సేవలందించారు. 
 
ఆరేళ్లకు పైగా ప్రధాన మంత్రిగా సేవలు అందించారు. ఆయన్ని భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించింది. ఆయన మంచి కవి, రచయిత కూడా.  దివంగత బీజేపీ నాయకుడు, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జీవితం ఆధారంగా `అటల్‌’ అనే సినిమాని రూపొందించబోతున్నారు.
 
మై రహూ యా నా రహూ ఏ దేశ్‌ రెహనా చాహియే- అటల్‌అనేది సినిమా పూర్తి టైటిల్‌. ఈ బయోపిక్‌ని కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. ఉల్లేక్‌ ఎన్‌పీ రాసినది అన్‌టోల్డ్ వాజ్‌పేయి పొలిటీషియన్‌ అండ్‌ పారాడాక్స్్‌ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
వినోద్‌ భన్సాలీ, సందీప్‌ సింగ్‌ నిర్మాతలు. దర్శకత్వం ఎవరు వహిస్తారనేది స్పష్టత లేదు. ఈ సినిమాలో వాజ్‌పేయి పాత్రలో బాలీవుడ్‌ విలక్షణ నటుడు పంకజ్‌ త్రిపాటి నటించబోతున్నట్టు తెలుస్తుంది. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడంలో పంకజ్‌ ముందుంటారు.
క్యారేక్టర్‌ ఆర్టిస్ట్ గా, విలన్‌గా అనేక సినిమాలు చేశారు. ఆయన మాజీ ప్రధాని పాత్రలో కనిపించబోతున్నారనే వార్త బాలీవుడ్‌లో వైరల్‌ అవుతుంది. అదే సమయంలో ఆసక్తి రేకెత్తిస్తోంది. వాజాపేయి పాత్రకి బాగా సూట్‌ అవుతారని, సరైన న్యాయం చేస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది (2023) డిసెంబర్‌ 25న విడుదల చేయబోతున్నారు.