కాళీమాత వేషధారణలో ధూమపానం చేస్తూ, గర్వం జెండా పట్టుకుని ఉన్న స్త్రీని చిత్రీకరించిన ఫిల్మ్ పోస్టర్పై ఏర్పడిన ఆగ్రవేశాలకు స్పందిస్తూ ఆమె ఇండియా టుడే కాంక్లేవ్ లో పాల్గొంటూ ఈ వాఖ్యలు చేశారు. అయితే ఆమె వాఖ్యలతో తమకు సంబంధం లేదని టిఎంసి స్పష్టం చేసింది.
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295 (ఎ) ఉద్దేశపూర్వక మరియు హానికరమైన చర్యలతో వ్యవహరిస్తుంది, దాని మతం లేదా మత విశ్వాసాలను అవమానించడం ద్వారా ఏదైనా తరగతి మతపరమైన భావాలను ఆగ్రహానికి గురిచేయడానికి ఉద్దేశించబడింది.“మహువా మోయిత్రా ప్రకటనలు హిందూ మతపరమైన మనోభావాలను దెబ్బతీశాయి. హిందూ దేవుళ్లను, దేవతలను అవమానిస్తే సహించబోము” అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. ఈ అంశంపై రాష్ట్రంలో మరిన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మొయిత్రా బుధవారం ట్వీట్ చేస్తూ, “జై మా కాళీ! బెంగాలీలు దేవతను నిర్భయంగా ఆరాధిస్తారు. సంతుష్ట పరచే పని చేయరు” అని తెలిపారు. బీజేపీ ఫిర్యాదుపై మహువా ట్విటర్ వేదికగా స్పందిస్తూ, రండి చూసుకుందాం బీజేపీ! అన్నారు. ‘‘నేను కాళీ మాత ఆరాధకురాలిని. నేను దేనికీ భయపడను. మీ మూర్ఖులకు, మీ గూండాలకు, మీ పోలీసులకు, కచ్చితంగా మీ ట్రోల్స్కు నేను భయపడను. సత్యానికి మద్దతిచ్చే శక్తుల అవసరం లేదు’’ అని పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్లోని బీజేపీ యూనిట్ మహువా మోయిత్రా కాళీ దేవతను “అవమానించినందుకు” నిర్మాణ తెలుపుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. ఆమె వాఖ్యాలను కేవలం టిఎంసి ఖండించడంతో సరిపోదని, బెంగాల్ బిజెపి అధ్యక్షుడు సుకాంత మజుందార్ స్పష్టం చేశారు. ముందుగా ఆమెను పార్టీ నుండి బహిష్కరించడం లేదా సస్పెండ్ చేయడం చేయాలని డిమాండ్ చేశారు.
మహువా మొయిత్రా వ్యాఖ్యల బాధ్యత నుంచి టీఎంసీ తప్పించుకోలదని పేర్కొంటూ ఆమె వాఖ్యాలను ఆమోదించని పక్షంలో ఆమెపై ఎందుకని చర్య తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. మరోవంక ఆమె వాఖ్యలకు నిరసనగా బిజెపి మహిళా మోర్చా కార్యకర్తలు బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు, పోలీస్ స్టేషన్కి వెళ్లి, ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
“సాంప్రదాయ మతంలో కాళీ తల్లిని మద్యం, మాంసం తినే దేవతగా పూజించరు. దుష్ట విధ్వంసక శక్తికి ప్రతీకగా కాళీ మాతను హిందువులు చాలా కాలంగా ఆరాధిస్తున్నారు. కాళి మాత గురించి ఈ ప్రకటన వెలుగులో నేను ఆమెను (మహువా మోయిత్రా) అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాను’ అని మజుందార్ ట్వీట్ చేశారు.
కాళీ దేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు దుర్గాపూర్లోని ఆండాల్ పోలీస్ స్టేషన్లో టిఎంసి లోక్సభ ఎంపిపై బిజెపి మీడియా సెల్ కన్వీనర్ జితేన్ ఛటర్జీ ఫిర్యాదు చేశారు.
మెయిత్రా టీఎంసీని వీడుతున్నారా?
More Stories
హైదరాబాద్లో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీవర్షం
సికింద్రాబాద్లో పలు విభాగాల్లో అగ్నివీర్ ఎంపికలు
విపక్షాలకు పాకిస్థాన్పై ప్రేమ? భారత సైన్యంపై ద్వేషం!