అధికారం ఉందన్న పొగరుతో ఇష్టానుసారం మాట్లాడారంటూ బీజేపీ సస్పెండెడ్ నేత నూపుర్ శర్మపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తప్పుబడుతూ పలువురు మాజీలు కలిసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు బహిరంగ లేఖ వ్రాసారు.
మాజీ న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్ల బృందం మంగళవారం నూపుర్ శర్మపై ఇటీవల సుప్రీంకోర్టు వాఖ్యాలను విమర్శించింది, సుప్రీంకోర్టు “లక్ష్మణ రేఖ”ను అధిగమించిందని ఆరోపిస్తూ, “తక్షణ దిద్దుబాటు” చర్యలకు పాల్పడాలని స్పష్టం చేసింది.
“న్యాయవ్యవస్థ చరిత్రలో ఇటువంటి దురదృష్టకర వ్యాఖ్యలు ఎప్పుడూ ఎరుగము. అతిపెద్ద ప్రజాస్వామ్యం న్యాయ వ్యవస్థపై ఇవి చెరగని మచ్చ. ఇవి ప్రజాస్వామ్య విలువలు, దేశ భద్రతపై తీవ్రమైన పరిణామాలను కలిగి ఉన్నందున తక్షణ దిద్దుబాటు చర్యలు అవసరం.” ఈ ప్రకటనలో 15 మంది మాజీ న్యాయమూర్తులు, 77 మంది మాజీ అఖిల భారత సర్వీసు అధికారులు, 25 మంది మాజీ సైనికాధికారులు సంతకం చేశారు.
నూపుర్ శర్మపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పర్దీవాలా చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఆ వ్యాఖ్యలు దురదృష్టకరమని, మునుపెన్నడూ వినలేదని వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంతకం చేసిన వారిలో బాంబే హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి క్షితిజ్ వ్యాస్, గుజరాత్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్ ఎం సోనీ, రాజస్థాన్ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు ఆర్ ఎస్ రాథోడ్, ప్రశాంత్ అగర్వాల్, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్ ఎన్ ధింగ్రా ఉన్నారు.
మాజీ ఐఏఎస్ అధికారులు ఆర్ఎస్ గోపాలన్, ఎస్ కృష్ణకుమార్, రాయబారి (రిటైర్డ్) నిరంజన్ దేశాయ్, మాజీ డీజీపీలు ఎస్పీ వైద్, బీఎల్ వోహ్రా, లెఫ్టినెంట్ జనరల్ వీకే చతుర్వేది (రిటైర్డ్), ఎయిర్ మార్షల్ (రిటైర్డ్) ఎస్పీ సింగ్ కూడా సంతకాలు చేశారు.
తన భద్రత దృష్ట్యా దేశంలో తనకు వ్యతిరేకంగా నమోదు అయిన ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై వాదనల సందర్భంగా నూపుర్ శర్మ భద్రతకు ముప్పు కాదని, ఆమె తన వ్యాఖ్యలతో దేశ భద్రతకు ముప్పుగా పరిణమించారంటూ అత్యున్నత న్యాయస్థానం జులై 1న ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రవక్తకు సంబంధించి వాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముందని, ఆమె వ్యాఖ్యలే దేశంలో కొన్ని దురదృష్టకర ఘటనలకు కారణమైందని (ఉదయ్పూర్ ఘటనను ఉద్దేశించి) బెంచ్ వ్యాఖ్యానించింది. ఇటువంటి వ్యక్తులు మతం కోసం మాట్లాడినట్లు కాదు. అసలు వీళ్లు ఇతర మతాలను గౌరవించే రకం కూడా కాదు. నోటి దురుసుతో దేశం మొత్తాన్ని రావణ కాష్టం చేశారని, యావత్ జాతికి ఆమె మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని సుప్రీం కోర్టు మండిపడింది.
అయితే సుప్రీం కోర్టు బెంచ్లో జస్టిస్ సూర్యకాంత్ నూపుర్ను ఉద్దేశించి చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారని, తక్షణమే వాటిని వెనక్కి తీసుకోవాలంటూ ఫోరమ్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్, జమ్ము అండ్ లడఖ్ అనే సంస్థ ఈ బహిరంగ లేఖను విడుదల చేసింది.
ధర్మాసనం వాఖ్యాలను విమర్శిస్తూ, “రాజ్యాంగం ప్రకారం అన్ని సంస్థలు తమ విధులను నిర్వర్తించే వరకు ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్యం చెక్కుచెదరకుండా ఉంటుందని బాధ్యతగల పౌరులుగా మేము విశ్వసిస్తున్నాము. సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తులు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ తీర్పును అధిగమించాయి. రాజ్యాంగం. లక్ష్మణ్ రేఖ దాటడంతో బహిరంగ ప్రకటన ఇవ్వమని మమ్మల్ని బలవంతం చేసింది.”
ఈ “దురదృష్టకర అపూర్వమైన” వ్యాఖ్యలు దేశంలో, వెలుపల దిగ్బ్రాంతి కలిగిస్తున్నాయి. “ఆమెకు న్యాయవ్యవస్థలో ప్రవేశం నిరాకరించారు. ఈ ప్రక్రియలో, భారత రాజ్యాంగ ఉపోద్ఘాతం, ఆత్మ, సారాంశంపై ఆగ్రహం వ్యక్తం అవుతుంది” అని వారు ఆరోపించారు. ఈ వాఖ్యలలో, “ఉదయ్పూర్లో పట్టపగలు అత్యంత దారుణమైన శిరచ్ఛేదం”ను `సమర్ధిస్తున్నట్లు’గా ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
“ఎఫ్ఐఆర్ అరెస్టుకు దారితీస్తుందనే పరిశీలనతో న్యాయపర్కియాకు సంబంధం గలవారు ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి గురవుతారు. దేశంలోని ఇతర ఏజెన్సీలపై వారికి నోటీసు లేకుండా పరిశీలనలు నిజంగా ఆందోళనకరంగా ఉన్నాయి.”
సుప్రీం కోర్టు ఇదివరలో ఇచ్చిన ఆదేశాలను ఉటంకిస్తూ ఆమెకు వ్యతిరేకంగా అన్ని ఎఫ్ఐఆర్లను జోడించాలని శర్మ చేసిన విజ్ఞప్తిని సంతకం చేసినవారు సమర్థించారు. “నూపుర్ కేసును మరో విధంగా ఎందుకు ఎందుకు పరిగణిస్తున్నారో అర్థం కావడం లేదు. సుప్రీంకోర్టు అనుసరించిన విధానం ఎటువంటి ప్రశంసలకు అర్హమైనది కాదు. పైగా, అత్యున్నత న్యాయస్థానం యొక్క పవిత్రత, గౌరవాన్ని ప్రభావితం చేస్తుంది” అని వారు హెచ్చరించారు.
More Stories
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై అందరి దృష్టి
కాంగ్రెస్కు అధికారమిస్తే రామాలయాన్ని కూల్చేస్తారు
ఆప్ తనను `బిజెపి ఏజెంట్’ అనడంపై మండిపడ్డ స్వాతి మలివాల్