జులై 17, 18 తేదీల్లో లష్కర్‌ ఉజ్జయిని మహంకాళి జాతర

తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా నిర్వహించే లష్కర్‌ బోనాల ఉత్సవాలు ఈ ఎంఎల్ 17, 18  తేదీలలో జరుగనున్నాయి.  ఆషాడ మాసంలో వచ్చే ఈ జాతర కోసం యవత్‌ తెలంగాణ ప్రజలు ఎంతో ఆసక్తితో ఈ జాతర కోసం ఎదురుచూస్తుంటారు. 
 
చిన్న పెద్ద అందరికి ఇష్టమైన పండుగ బోనాల పండుగను, కరోనా నిబంధనాలు పాటిస్తూ జాతరను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సికింద్రాబాద్‌లోని చారిత్రాత్మకమైన ఉజ్జయిని మహంకాళీ జాతర జులై 17, 18 తేదీల్లో జరుగనున్నది. దీనికి రెండు వారాల ముందు ఘటాల ఊరేగింపు ప్రారంభం కానుండడంతో లష్కర్‌లో పండుగ వాతావరణం కనిపిస్తున్నది.
ఈ జాతరకు దాదాపు 20 లక్షల మందికి పైగా భక్తులు రానున్న దృష్ట్యా అందుకు తగ్గా ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. 205 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేవాలయానికి రాష్ట్రం నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి వేలాది భక్తులు తరలిరానున్నారు. జూలై 17వ తేది ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు. తెల్లవారుజామున 4 గంటలకు వేదమంత్రోచ్చారణలతో ఆలయ ద్వారం తెరవడం జరుగుతుంది.
అదే రోజు తెల్లవారుజాము నుండే నగర మూల ల నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాది మంది తరలి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. సాయంత్రం 5 గంటల నుండి సోమవారం తెల్లవారుజామున 5 గంటల వరకు వివిధ ప్రాంతా ల నుండి వచ్చే ఫలహరబండ్లు దేవాలయం చుట్టూ తిరిగి పోతరాజు లు ఆలయం లోపలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటారు.
18వ తేదిన తెల్లవారుజామున 5 నుండి ఉదయం 7 వరకు ఆలయంను  శుభ్రపరుస్తారు. ఎనిమిదిన్నరకు రంగం కార్య క్రమం ఉంటుంది. రాష్ట్రంలో జరిగే భవిష్యవాణిని వివరించడం జరుగుతుంది.
ఉదయం 11 గంటలకు శ్రీ అమ్మవారి చిత్రపటం ఏనుగు పై అమర్చి ప్రత్యేక అలంకరణ చేసి బ్యాండ్‌, బాజా వాయిద్యాలతో అనేక మంది భక్తులు, స్వచ్చంద సంస్థలతో, పుర ప్రముఖులతో ఆలయం చుట్టు ప్రదర్శన చేసి తదుపరి అమ్మవారి గజాధిరోహణమై పురవీధుల గుండా మెట్టుగూడ ప్రాంతానికి ఘటంతో సహా వెళ్తుంది.