దేశ ప్రగతికోసం అగ్నిపథ్‌లో నడుస్తున్న మోదీ!

దేశ ప్రగతికి ప్రధాని నరేంద్ర మోదీ అగ్నిపథ్‌ పై నడిచారంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మోదీపై ప్రశంసల జల్లు కరిపించారు. ఈ అగ్నిపథ్‌ పథకం పై పెద్ద ఎత్తు ప్రతిపక్షాల నుంచి ఎదురుదెబ్బ తగలడంతో సంస్కరణలు, పనితీరులో మార్పులు రూపాంతరం చెందకపోతే భారత్‌ ఎలా గొప్పగా మారుతుందని ఆయన ఎదురు ప్రశ్నించారు. 

లెఫ్టినెంట్ జనరల్ పూరి ఆర్మీ కాన్ఫరెన్స్‌లో అగ్నిపథ్ కార్యక్రమాన్ని వివరించిన తీరును ప్రస్తావిస్తూ దీనితో ఈ పథకంపై  ఎలాంటి సందేహం ఉండబోదని విశ్వాసం వ్యక్తం చేశారు. కొన్ని విషయాల్లో రాజకీయాలు ఉండకూడదని చెప్పవలసి రావడం పట్ల విచారం వ్యక్తం చేశారు. జాతీయ విధానాలపై కూడా దేశంలో రాజకీయాలు జరుగుతున్నాయని మండిపడ్డాయిరు. 

ఆర్మీ అధికారులు ముందుకు వచ్చి ఈ దేశంలో కాల్పులకు, హింసకు తావు లేదని, హింసకు పాల్పడవద్దని నిరసనకారులకు చెప్పాల్సి వచ్చినదని గుర్తు చేశారు. భారతదేశ ప్రగతి కోసం మోదీ అగ్నిపథ్‌లో నడవడం చూసి ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఈ జాతీయవాదాన్ని చూసి జీర్ణించుకోలేక పోతున్నారని అంటూ దీనిపై కూడా రాజకీయాలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పథకాన్ని వెనక్కి తీసుకోమని స్పష్టం చేస్తూ దేశాన్ని యవ్వనంగా మార్చడానికి ఇదోక ప్రగతిశీల చర్య అని ఓ సీనియర్ ఆర్మీ అధికారి పేర్కొనడాన్ని గుర్తు చేశారు. “మేము జాతీయ భద్రతలో తలామునకలవుతున్నాం, మాకసలు తీరికనేది ఉండేదు. ఒక చిన్న ఉదాహరణ చెబుతున్నా…ఎత్తైన ప్రాంతాల్లో గస్తీ కాస్తున్నప్పుడు ఆరోగ్యం పై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?” అని ఆ అధికారి ప్రశ్నించారని చెప్పారు. 

“ఏటా చాలా మంది ఈ ప్రాంతాల్లో చనిపోతున్నారు. ఎంత ప్రాణ నష్టం వాటిల్లుతోందో కూడా మీకు తెలియదు. ముందు వీటి గురించి కూలంకషంగా తెలుసుకోండి. ఆ తర్వాత యువత ఎందుకు ముఖ్యమో మీకు అర్థమవుతుంది,” అని ఆ అధికారి మాటలను సంబిత్ పాత్ర ఉదహరించారు.