మైసూర్ లో మోదీ, 75 ప్రముఖ ప్రదేశాల్లో కేంద్ర మంత్రులతో యోగా దినోత్సవం  

అంతర్జాతీయ యోగా దినోవ‌త్స‌వాన్ని ఈ నెల 21న దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా సన్నాహాలు చేస్తున్నారు.   క‌ర్ణాట‌క‌లోని మైసూర్ ప్యాలెస్ లో జరిగే ప్రధాన ఉత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ  యోగా సాధ‌న చేయ‌నున్నారు. 75 మంది కేంద్ర మంత్రులు ముఖ్యమైన 75 చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలలో యోగా చేస్తారు.
దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌కు గుర్తుగా.. 75 చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలలో యోగా కార్యక్రమాలలో పాల్గొనడానికి 75 మంది మంత్రులను నామినేట్ చేశారు. ఈ కార్య్ర‌క్ర‌మంలో భాగంగా.. మ‌హారాష్ట్ర లోని నాసిక్‌లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ త్రయంబకేశ్వర్ ఆలయ సముదాయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా యోగా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అలాగే తమిళనాడులోని కోయంబత్తూరులో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఢిల్లీలోని లోటస్ టెంపుల్‌లో యోగాభ్యాసం చేయనున్నారు. నాగ్‌పూర్‌లోని జీరో మైల్‌స్టోన్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా కోటలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ యోగాభ్యాసం చేయనున్నారు.
సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లోని నలాగర్ ప్యాలెస్‌లో యోగా కార్యక్రమంలో పాల్గొంటారు.కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లక్నో రెసిడెన్సీలో, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో యోగా చేయనుండగా, మంత్రి అర్జున్ ముండా జార్ఖండ్ రాజధాని రాంచీలో యోగా చేయనున్నారు.
ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ యోగా సాధన చేయ‌నుండ‌గా.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హంపిలోని స్మారక కట్టడం వద్ద, మహారాష్ట్రలోని పూణె మెట్రో స్టేషన్‌లో నారాయణ్ రాణే యోగాభ్యాసం చేయనున్నారు. కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ సిక్రీ కోటలో యోగా చేస్తారు.
కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ నర్మదా నదికి మూలమైన మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్‌లో యోగా చేయనున్నారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ కోటలో, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని హర్ కీ పౌరిలో, కేంద్ర మంత్రి ఆర్‌కె సింగ్ బీహార్‌లోని ప్రసిద్ధ నలంద మహావిహారంలో, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా గుజరాత్‌లోని కెవాడియాలోని సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద యోగాభ్యాసం చేయనున్నారు.
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని ప్రసిద్ధ సామ్ సాండ్ డ్యూన్స్‌లో యోగా చేయనుండగా, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలంగాణలోని ఆనంద్ సాగర్ లేక్ సైట్‌లో, కేంద్ర మంత్రి ఆర్‌సిపి సింగ్ గయాలోని ప్రసిద్ధ మహాబోధి ఆలయంలో, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశాలోని పూరీలోని ప్రసిద్ధ కోణార్క్ సూర్య దేవాలయ సముదాయంలో యోగా చేస్తారు.
గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని ప్రసిద్ధ చారిత్రక హరప్పా నాగరికత ప్రదేశం ధోలవీరాలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా యోగాభ్యాసం చేయనుండ‌గా.. ఢిల్లీలోని ఎర్రకోటలో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ యోగాభ్యాసం చేయనున్నారు.